పవన్ కళ్యాణ్ అత్యంత నెమ్మదిగా సినిమాలు చేసే టాప్ హీరో. పవన్ కు ఉన్న క్రేజ్ కు అతడు వేగంగా సినిమాలు చేస్తే అతడు ఈపాటికి ఖచ్చితంగా 50 సినిమాల మార్కును అందుకుని  ఉండేవాడు. అయితే పవన్ తీరువేరు కావడంతో  అంత క్రేజ్ ఉన్నా కనీసం 25 సినిమాల మార్క్ ను కూడా అందుకోలేక పోయాడు. ఈ పరిస్థితలు ఇలా ఉంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యూచ‌ర్ ప్రాజెక్టుల విషయమై వస్తున్న క్లారిటీ అందరికీ షాక్ ఇస్తోంది.
 
నిన్ననిర్మాత శరత్ మరార్  డాలీ ద‌ర్శ‌క‌త్వంలో అనుకుంటున్న సినిమా ఆగిపోలేదంటూ ట్విట్ చేసి ఒక్కరోజు గడవకుండానే ఈరోజు నుండి ప‌వ‌న్  ప్రారంభిస్తున్న మరో సినిమాకు సంబంధించి న్యూస్ చాలామందికి  షాక్ ఇస్తోంది. విజ‌య్‌ మోహ‌న్ లాల్ కాంబినేష‌న్లో ‘జిల్లా’ లాంటి సూప‌ర్ హిట్ అంధించిన త‌మిళ ద‌ర్శ‌కుడు ఆర్.టి.నీశ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఈ సినిమా షూటింగ్ ను కుడా అక్టోబర్ నుండి మొదలు పెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటూ వార్తలు హడావిడి చేస్తున్నాయి.
 
ఈ సినిమా అజిత్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘వేదాలంకు రీమేక్ అంటున్నారు. ఎ.ఎం.ర‌త్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు . ఒక వైపు త్రివిక్రమ్ పవన్ కోసం ఒక స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్న నేపధ్యంలో  ప‌వ‌న్ - నీశ‌న్‌ కాంబినేషన్ మూవీకి పవన్ ఎలా లైన్ క్లియర్ చేసాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఇది ఇలా ఉండగా పవన్  రేణుదేశాయ్ తో తప్ప  మరి ఏ హీరోయిన్ తోనూ రెండోసారి  నటించని  నేపధ్యంలో  తన లేటెస్ట్  సినిమాలో  శృతి హాసన్ ఎంపిక చేయడం వెనుక పవన్ హీరోయిన్ సెంటిమెంట్ బాగా పనిచేసింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పవన్ నిర్ణయాలు రోజు రోజుకు అర్ధం కాని పజిల్ లా మారి పోతున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: