బుల్లితెర రారాజుగా ప్రేక్షకులను కితకితలు పెట్టించే కామెడీ ప్రోగ్రాం అంటే కచ్చితంగా మల్లెమాల వారి జబర్దస్థ్ ఖతర్నాక్ కామెడీ షోనే. ముందు జబర్దస్థ్ గా ఉండే ఈ షో కాస్త రెండు భాగాలుగా మారి ఇంకొంత ఎక్స్ ట్రా కామెడీని పంచుతుంది. అయితే ఈ షోలో ముందునుండి ఉంటున్న కంటెస్టన్స్ కంటే వెనుక వచ్చిన వారు టీం లీడర్స్ గా మారి సీనియర్స్ కు మంచి కాంపిటీషన్ ఇస్తున్నారు. 


ఇక గ్రూపులుగా మారిన జబర్దస్థ్ టీంలో ఇదవరకు ఒకే టీంలో ఉన్న రాకింగ్ రాకేష్, కిరాక్ ఆర్పి ఇప్పుడు రెండు టీంలుగా విడిపోయారు. అయితే వీరిద్దరి మధ్య గొడవల వల్లే రెండు టీములు గా డివైడ్ చేయాల్సి వచ్చిందని ఇన్నర్ టాక్. ఈ షోలో ఒకరి మీద ఒకరు పంచ్ లేసుకోవడం మాములే.. ఇక ఆ పంచ్ ల పుణ్యమాని ఈ కంటెస్టన్స్ బయట వ్యవహారాలు ఎలా ఉంటాయో తెలుస్తుంది.     


ఆల్రెడీ సుధీర్ మంచి రొమాంటిక్ ఫెలో అని అందరు అంటుంటారు.. ఇక రాకేష్, ఆర్పిల మధ్య గొడవలకు కారణాలు కూడా ఇద్దరి మధ్య రెమ్యునరేషన్ కారణాలని పైకి చెబుతున్నా రాకేష్, ఆర్పిల ఈగో ప్రోబ్లంస్ ఇద్దరిని విడదీసేలా చేసిందట. టీంలో కామెడీ చేసినా చేయకపోయినా టీం లీడర్ కే మంచి పేరు వస్తుంది. అదికాక టీం లీడర్ మిగతా కంటెస్టన్స్ ను తిట్టే హక్కు కూడా ఉంటుంది.


ఆ క్రమంలో రాకేష్ టీంలో కొత్తవాడిగా వచ్చిన ఆర్పి రాకేష్ తిట్లను భరించలేక తనకు తానుగా కొత్త టీంను ఏర్పరచుకున్నాడు. ఇక ఆర్పి టీంలో జూనియర్ ఆర్టిస్ట్ మహేష్ ముఖ్య పాత్ర పోశిస్తున్నాడు. మహేష్ చేత ఆర్పి పండించే కామెడీ మస్త్ జబర్దస్త్ గా వర్క్ అవుట్ అవుతుంది. ఇక రాకేష్, ఆర్పిల మధ్య స్కిట్ కొట్టాలన్న కసి ప్రతి ఎపిసోడ్ మంచి రసవత్తరంగా మారుతుంది. కారణాలు ఎలా ఉన్నా ఇద్దరి మధ్య నిజంగా గొడవలై విడిపోయారా లేక మల్లెమాల టీం లీడర్స్ కోసమే వారిని విడదీసిందా అన్నది వారు నోరు విప్పితేనే తెలుస్తుంది.      



మరింత సమాచారం తెలుసుకోండి: