పవన్ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నా పవన్ నటించిన ‘ఖుషి’ సినిమా విడుదలయి 15 ఏళ్ళు గడిచిపోయినా పవన్ అభిమానులు ఆ సినిమా పేరు చెపితే చాలు ఇప్పటికీ జోష్ లోకి వెళ్ళి పోతారు. ఆ సినిమా తరువాత పవన్ ఎస్ జ్ సూర్యల కాంబినేషన్ కు ఏర్పడ్డ క్రేజ్ ను కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ‘కొమరం పులి’ తగ్గించినా మళ్ళి అదే కాంబినేషన్ పవన్ తన లేటెస్ట్ సినిమాతో  మళ్ళి రిపీట్ చేద్దాము అనుకున్నాడు పవన్.

అయితే అధికారికంగా ఈ సినిమా ప్రకటింపబడి పూజా కార్యక్రమాలు కూడ జరిగిపోయాక ఈ మూవీ ప్రాజెక్ట్ నుండి ఎస్.జె. సూర్య తప్పుకోవడం వెనుక మురగదాస్ సినిమాలో సూర్యా మహేష్ కు విలన్ గా నటించడం అని అనుకున్నారు అంతా. అయితే ఈ బ్రేకప్ కు అసలు కారణంవేరు దీనివెనుక ఆర్ధిక కారణాలు ఉన్నాయి అంటూ ఫిలింనగర్ లో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 

మొదట్లో పవన్ సినిమాకు ఎస్.జె. సూర్యా దర్శకత్వం వహించడానికి కేవలం కోటి రూపాయల పారితోషికం ఈసినిమా నిర్మాత శరత్ మరార్ ఆఫర్ చేసినట్లు టాక్. ఈమధ్య కాలంలో ఎస్.జె. సూర్య దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ ఫ్లాప్ లుగా మారడంతో ఇంత తక్కువ పారితోషికాన్ని అతడికి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. దీనితో తనకు ఆఫర్ చేసిన పారితోషికం చాల తక్కువ అన్న ఫీలింగ్ తో ఎస్.జె.సూర్య అయిష్టంగానే పవన్ మూవీ ప్రాజెక్ట్ ను అంగీకరించాడు అని టాక్.

అయితే అనుకోకుండా ఎస్.జె. సూర్యా నటించిన ‘ఇరైవి’ తమిళంలో సూపర్ హిట్ కావడం మురగదాస్ దృష్టి సూర్యా పై పడటంతో పాటు మహేష్ సినిమాలో విలన్ పాత్ర పోషించడానికి 2 కోట్ల భారీ ఆఫరింగ్ రావడంతో దర్శకుడుగా పవన్ తో సినిమా చేసే టార్చర్ కన్నా కేవలం 60 రోజులు నటిస్తే 2 కోట్లు వచ్చి పడతాయి అన్న ఉద్దేశ్యంతో ఆఖరి నిముషంలో దర్శకుడు సూర్యా పవన్ కు ఊహించని షాక్ ఇచ్చినట్లు టాక్. ఈ వార్తలే నిజం అయితే సినిమా రంగంలో ఆర్ధిక కారణాలు స్నేహాన్ని కూడ ఏవిధంగా ప్రభావితం చేస్తుందో అర్ధం అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: