ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న మూవీ కబాలి. ఒక్క ఇండియాలోనే కాకుండా కబాలి మానియా ఇప్పుడు ప్రపంచమంతా ఉందనే చెప్పాలి. ఎందుకంటే కబాలి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతలా ఎదురుచూశారంటే, ఈ మూవీకి మొదటి రెండు రోజులకే దాదాపు వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ ఇచ్చారు. అయితే కబాలి మూవీ రిలీజ్ అనంతరం ఈ మూవీ మొదటగా ఎదుర్కోవలసిన పరీక్ష...ప్రేక్షకుల తీర్పు.

ఈ ప్రేక్షకుల తీర్పు నుండి కబాలి మూవీ బయటపడలేకపోయింది. మొదటి రోజే కబాలి యావరేజ్ అనే టాక్ ని సొంతం చేసుకుంది. ఇంకొంత మంది ప్రేక్షకులు అయితే కబాలి మూవీ ప్లాప్ అంటూ చెప్పుకొచ్చారు. ఏదైమానా ఈ టాక్స్ కబాలి మూవీ కలెక్షన్స్ పై ఏ మాత్రం ప్రభావితం చూపించలేకపోయాయి. ఇదిలా ఉంటే మొదటి రోజు ప్రదర్శన అనంతరం కబాలి నిర్మాత ఈ మూవీ కలెక్షన్స్ పై ప్రెస్ మీట్ పెట్టిన విషయం తెలిసిందే.

అయితే ఈ ప్రెస్ మీట్ ని పెట్టిన నిర్మాత కలైపులి థాను...కబాలి తొలి రోజే ఏకంగా రూ.250 కోట్లు వ‌సూలు చేసిందంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అలాగే ఈ మూవీ 8000 థియోటర్స్ కి పైగా రిలీజ్ అయిందంటూ చెప్పుకొచ్చాడు. ఈ లెక్కలను ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఏ క్రిటిక్స్, ట్రేడ్ వర్గాలు ఏకీభవించటం లేదు.

నిర్మాత కచ్ఛితంగా తప్పుడు సమాచారం ఇస్తున్నాడని తేల్చి చెబుతున్నారు. అంతే కాకుండా కచ్ఛితమైన సమాచారం ఇవ్వకపోతే ఇది మూవీ ప్రదర్శనలపై ప్రభావితం చూపుతుందని ట్రేడ్ పండిట్స్ చెప్పుకొచ్చారు. ఇక కబాలి కలెక్షన్స్ మొదటి రోజు 250 కోట్ల రూపాయలు అనేది ఓ కామెడీ అంటూ బిటౌన్ ఇండస్ట్రీ స్ట్రాంగ్ కామెంట్స్ చేస్తుంది. దీంతో నిర్మాత టంగ్ స్లిప్ కి రజనీకాంత్ ఫైర్ అయినట్టుగా కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: