న్యాయం అందరికి న్యాయమేనా లేకుంటే ఒక్కో హీరోను బట్టి ఒక్కో విధంగా ఉంటుందా అన్న విషయం అర్ధమవ్వాల్సి ఉంది. అదేంటి ఎందుకు అలా అడుగుతున్నారు అంటే.. మోహన్ బాబు చేసిన ఓ తప్పుకి ఆయన్ను నానా తిప్పలు పెట్టి ఇబ్బంది పెట్టారు ఇక అదే తప్పు రజినికాంత్ చేస్తే మాత్రం ఎవరు ప్రశ్నించరా అంటున్నారు.


ఇంతకీ మోహన్ బాబు చేసిన ఏ తప్పు సూపర్ స్టార్ రజినికాంత్ చేశారు అంటే.. సాధారణంగా పద్మ అవార్డులేవైనా ఒకటే గౌరవం ఉంటుంది. మోహన్ బాబుకి పద్మశ్రీ గౌరవం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం సూపర్ స్టార్ రజినికి పద్మవిభూషన్ అవార్డ్ ఇచ్చి గౌరవించింది. అయితే మోహన్ బాబు తనకు వచ్చిన పద్మశ్రీను స్క్రీన్ నేమ్ గా వాడి అగౌరవపరచాడని కేసు వేయడం తెలిసిందే. 


ఇక ఆ తర్వాత డా.బ్రహ్మానందం కు కూడా ఈ తరహా గొడవతో వచ్చిన తలనొప్పులు ఉన్నాయి.. వాటినన్నిటి నుండి ఎలాగోలా ఇద్దరు బయటపడ్డారు అయితే రజినికాంత్ మాత్రం స్క్రీన్ నేమ్ సూపర్ స్టార్ తో పాటుగా పద్మవిభూషన్ రజినికాంత్ అని వేసుకున్నారు. మరి సినిమా పరిశ్రమకు సంబందించినంతవరకు అందరికి ఒకే రకమైన రూల్ ఉండాలి కాని మోహన్ బాబు తన పేరు ముందు పద్మను వాడితే గొడవ పెట్టిన వారు ఇప్పుడు రజిని విషయంలో ఎందుకు మాట్లాడట్లేదో మరి.   


అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే మోహన్ బాబు పద్మ అవార్డ్ స్క్రీన్ మీద వేసుకోవడం గురించి ఎవరో ఒక అతను కోర్ట్ లో పిల్ వేశాడు. కాని రజినికాంత్ గురించి అలా ఎవరైనా సరే కేసు వేస్తే అప్పుడు దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది. కబాలి రిజల్ట్ తో పాటుగా ఇప్పటికే లింగా సినిమా గొడవలతో ఉన్న రజినికి ఈ కొత్త తలనొప్పి ఎందుకనుకున్నారో ఏమో ఎవరు ఏ విషయం గురించి మాట్లాడట్లేదు. ఏది ఏమైనా రజిని చేస్తే మాట్లాడరు కాని మోహన్ బాబును మాత్రం కాస్త ఇబ్బంది పెట్టారు జనాలు.



మరింత సమాచారం తెలుసుకోండి: