దర్శకుడు వినాయక్ కు చిరంజీవి 150వ సినిమా దర్శకత్వం వహించడం రోజురోజుకు పెనుభారంగా మారిపోతోంది అన్న భావనలోకి వెళ్ళి పోతున్నాడు అన్న గాసిప్పులు వినపడుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా టైటిల్ దగ్గర నుంచి స్క్రిప్ట్ వరకు అన్ని విషయాలలోను చిరంజీవి సూచనలతో రాజీ పడిపోయిన వినాయక్ కు చిరూ లేటెస్ట్ గా చేప్పట్టిన కాస్ట్ కటింగ్స్ వినాయక్ కు విపరీతమైన టెన్షన్ పెట్టిస్తున్నాయని టాక్. 

ఈమధ్య కాలంలో విడుదలైన టాప్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలు అన్నీ కలక్షన్స్ విషయంలో బోల్తా కొడుతున్న నేపధ్యంలో చిరంజీవి తన ‘కత్తిలాంటోడు’ విషయమై కాస్ట్ కటింగ్స్ చేపట్టాడు అన్న వార్తలు వస్తున్నాయి. దీనికి ఉదాహరణగా చిరంజీవి 150 వ సినిమాకు విలన్ గా ఎంపిక చేసిన తరుణ్ అరోరా వ్యవహారం అని అంటున్నారు. 
చిరంజీవికి సవాల్ విసిరే విలన్ పాత్రకు వివేక్ ఒబెరాయ్ - అరవింద్ స్వామి – జగపతి బాబు పేర్లు పరిశీలించి చిట్టచివరకు తరుణ్ అరోరా ను విలన్ గా ఎంపిక చేయడం వినాయక్ కు ఇష్టం లేకపోయినా ఈ విషయంలో కూడ చిరంజీవి నిర్ణయానికి రాజీ పడ్డాడు అన్న వార్తలు వస్తున్నాయి.

స్టార్ విలన్స్ అంతా కోట్లాది రూపాయలు పారితోషికాలు డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో ఎప్పుడో ఫేడ్ అయిపోయిన తరుణ్ అరోరాను తక్కువ పారితోషికానికి వస్తున్నాడు అన్న నెపంతో ‘కత్తిలాంటోడు’ కి విలన్ గా మారిస్తే అసలకే మోసం వస్తుందేమో అన్న భయం దర్శకుడు వినాయక్ ను వెంటాడుతోంది అని టాక్. 

ఇప్పటికే చిరంజీవి ఒకటికి పది సార్లు వినాయక్ తీసిన ప్రతి సీన్ ను స్కాన్ చేస్తున్న నేపధ్యం మరో వైపు హీరోయిన్ సమస్యలు ఇలా నేక సమస్యల మధ్య నిర్మాణం జరుపుకుంటున్న చిరంజీవి 150వ సినిమా మెగా అభిమానుల అంచనాలను అందుకోలేకపోతే ఆ పాపం అంతా తన పై రుద్ది తనను బలి చేస్తారా అన్న భయంలో వినాయక్ టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ‘కత్తిలాంటోడు’ సినిమాను తక్కువ బడ్జెట్ తో చుట్టేసి 100 కోట్లను మించిన బిజినెస్ చేసేస్తారా అన్న సెటైర్లు ఫిలింనగర్ లో వినిపిస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: