టాలీవుడ్ మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ చాన్స్ వస్తే చాలు చాల అని టాప్ క్రేజీ బ్యూటీలు అంతా ఎదురు చూస్తూ ఉంటే శ్రీదేవి కూతురు జాహ్నవి మహేష్ బాబుతో నటించడానికి వచ్చిన అవకాశాన్ని వదులుకుంది అన్న వార్తలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మురగదాస్ మహేష్ బాబుల కాంబినేషన్ లో తూపొందుతున్న సినిమాకు బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రాతో తేడాలు వచ్చిన విషయం తెలిసిందే.

ఆ తరువాత దర్శకుడు మురగ దాస్ మహేష్ పక్కన శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవిని హీరోయిన్ గా చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశ్యంతో శ్రీదేవిని కలిసినట్లు టాక్. ఇప్పటికే లాస్ ఏంజెలిస్ లోని లీ స్ర్టాస్బర్గ్ యాక్టింగ్ స్కూల్లో శిక్షణ పొందుతున్న జాహ్నవిని మహేష్ పక్కన హీరోయిన్ పాత్ర విషయమై సంప్రదిస్తే తాను మహేష్ సినిమా అయినా కూడా తాను ఇప్పుడప్పుడే చేయలేను అని అనడమే కాకుండా తానింకా హీరోయిన్ గా మారడానికి మానసికంగా రెడీ కాలేదు అన్న సమాధానాన్ని తన తల్లి శ్రీదేవి ద్వారా చెప్పించినట్లు టాక్. 

అయితే బాలీవుడ్ మీడియాలో ఈ విషయమై వేరే విధంగా కథనాలు వినిపిస్తున్నాయి. శ్రీదేవి తన కూతురును మొదటి సినిమాతోనే టాప్ హీరోయిన్ గా మార్చాలి అన్న ఉద్దేశ్యంతో  షారూఖ్ ఖాన్ కొడుకు హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే సినిమాతో తన కూతురి ఫిలిం ఎంట్రీ ఉండాలి అన్న ఉద్దేశ్యంతో శ్రీదేవి ఇలా సున్నితంగా ఈ ఆఫర్ ను తిరస్కరించింది అని బాలీవుడ్ మీడియాలో గాసిప్పులు వినిపిస్తున్నాయి. 

ఇక జాహ్నవి కూడ మిస్ కావడంతో మురగ దాస్ మహేష్ లు ఖంగారు పడి రకుల్ ప్రీత్ ని లైన్ లో పెట్టినట్లు టాక్. మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న  ఈసినిమా షూటింగ్ నిన్న అన్నపూర్ణ స్టూడియో లో ప్రారంభం అయింది.  దేవుడి ఫోటోలపై తీసిన తొలి సీన్ కు డైరక్టర్ మురగదాస్ కెమేరా స్విచ్ ఆన్ చేసాడు అని వార్తలు వస్తున్నాయి.  . ఎప్పటిలాగే సెంటిమెంట్ ప్రకారం  మహేష్ బాబు తొలి రోజు షూటింగ్ కు రాకపోవడం మరో ట్విస్ట్..


మరింత సమాచారం తెలుసుకోండి: