ఈ ఏడాది సమ్మర్ రేస్ కు వచ్చిన ‘సరైనోడు’ విడుదలై అయి నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంటోంది. మొదటి రోజు మొదటి షో నుండి డివైడ్ టాక్ తో ప్రారంభం అయిన ఈ సినిమా 100 రోజుల రన్ పూర్తి చేసుకోవడమే కాకుండా ఈ సినిమాకు 76 కోట్లు వసూలు కావడంతో పాటు ఈ సినిమా మలయాళంలో కూడ బాగా ఆడటంతో మంచి జోష్ మీద ఉన్నాడు బన్నీ. 

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక మలయాళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆశక్తికర విషయాలను బయట పెట్టాడు. సోషల్ మీడియాలో మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ ను కలిగి ఉన్న అల్లుఅర్జున్  తాను  ఎవరి ఫ్యాన్ ? అన్న విషయాన్ని బయట పెట్టాడు. ఇప్పటివరకు బన్నీ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అని అనుకుంటున్నారు అంతా. 

అయితే అసలు విషయాలు వేరు బన్నీ ఆల్ టైమ్ ఫేవరేట్ స్టార్ మైఖేల్ జాక్సన్ అన్న విషయాన్ని బయట పెట్టాడు. అందుకే ఫిలింనగర్ లోని తన డ్యాన్స్  ప్రాక్టీసింగ్ హాల్లో మైఖేల్ జాక్సన్ ఫోటోను పెట్టుకున్నాను అని చెపుతున్నాడు. ఇక హాలీవుడ్ లో తనకు ఇష్టమైన నటుడు లియోనార్డో డికాప్రియో అని అలాగే హిందీలో ఎప్పటికీ అమితా బ్  బచ్చన్  అమీర్ ఖాన్ లు తనకు నచ్చే నటులు అన్న విషయాన్ని బయట పెట్టాడు. 

అదేవిధంగా  తమిళంలో అయితే ధనుష్ విజయ్ సేతుపతి తనకు బాగా నచ్చుతారు అని చెప్పిన బన్నీ తెలుగులో మాత్రం తనకు బాగా నచ్చే హీరో ఎవరు అన్న విషయం బయటకు చెప్పకుండా చాల తెలివిగా వ్యవహరించాడు. అయితే మెగా ఆడియో ఫంక్షన్స్ లో ఎప్పుడూ మెగా స్టార్ చిరంజీవి భజన చేసే అల్లుఅర్జున్ తాను మలయాళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం చిరంజీవిని మరిచి పోవడం ఒక విధంగా మెగా అభిమానులకు షాక్ ఇచ్చే న్యూస్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: