ఈ మద్య సినిమాలపై భారీ అంచనాలు పెరిగిపోవడానికి వేదికగా నిలిచేది ఆడియో ఫంక్షన్. ప్రతి చిన్న సినిమా కూడా ఆడియో వేడుక బాగా అట్టహాసంగా చేయడం ఆనవాయితీగా మారింది. ఇక పెద్ద హీరోల సినిమాల ఆడియో ఫంక్షన్ అంటే వేరే చెప్పాలా..హీరో, హీరోయిన్లతో పాటు సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరూ అక్కడకు రావాల్సిందే. గత శుక్రవారం ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ చిత్రం భారీ స్థాయిలో ఆడియో వేడుక జరిగింది. అంతా బాగుంది కానీ ఆ ఫంక్షన్లో ఓ రెండు లోపాలు బాగా కనిపించాయి..ఒకటి మళియాల సూపర్ స్టార్ మోహన్ లాల్ రెండవది అందాల భామ సమంత. ఈ విషయంపై టాలీవుడ్ లో రక రకాల రూమర్లు పుట్టుకొచ్చాయి..అయితే సమంత మాత్రం 'ఈ రోజు అనారోగ్యంగా ఉంది.
అందుకే 'జనతా గ్యారెజ్' ఆడియో ఫంక్షన్కు హాజరుకాలేకపోతున్నా' అని సమంత ట్విట్టర్లో వివరణ ఇచ్చింది. ఇకపోతే సమంత రావకపోవడానికి కారణం ప్రస్తుతం నాగాచైతన్య-సమంత ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే వారు పెళ్లి చేసుకోబోతున్నారని బలంగా కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్లో ఇది హాట్ న్యూస్గా మారింది.
సమంత ఎక్కడికి వెళ్లినా.. ఆమెను ఇదే విషయమై మీడియా ఆరా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'జనతా' ఫంక్షన్కు దూరంగా ఉండాలని చైతూ సమంతకు సూచించాడట. చైతూ మాటకు విలువ ఇచ్చిన సమంత ఈ ఫంక్షన్కు హాజరు కాలేదని టాలీవుడ్ వర్గాల భోగట్టా.