ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రెండు భారీ సినిమాలకి సంబంధించిన రిలీజ్ లు ఒకే రోజున రిలీజ్ అవుతున్నాయి. దీంతో టాలీవుడ్ బాక్సాపీస్ వద్ద కొంత గంధరగోళం ఏర్పడనుంది. ఆ రెండు సీనిమాలే ‘జనతా గ్యారేజ్’, ఇంకొక్కడు. అయితే ఈ పరిస్థితిని గమనించిన నిర్మాతలు…ఇంకొక్కడు మూవీ రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసిన వివషయం తెలిసిందే. విక్రమ్ నటించిన ఈ మూవీని పోస్ట్ పోన్ చేయటానికి తెరవెనక జరిగిన తతంగం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా వినిపిస్తున్నాయి.


దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్స్ ప్రకారం, ‘జనతా గ్యారేజ్’ సెప్టెంబరు 2న భారీ ఎత్తున విడుదలవుతుంది. ఇదే రోజు చియాన్ విక్రం నటించిన‘ఇంకొక్కడు’ సైతం రిలీజ్ కావాల్సి ఉంది. మొదట వీరిద్దరి మూవీలు ఒకే రోజు రిలీజ్ అవుతాయని రెండు మూవీలకి సంబంధించిన నిర్మాతలకి తెలిసినప్పటికీ…వీరు ఆ పోటీకి రెడీ అన్నట్టుగానే ఉన్నారు. విక్రమ్ సైతం.. ‘జనతా గ్యారేజ్’రిలీజ్ రోజే రిలీజ్ చేయండి అని నిర్మాతలకి చెప్పుకొచ్చారు.


ఎందుకంటే విక్రమ్ నటించిన ఇంకొక్కడు మూవీ కచ్ఛితంగా హిట్ ని సాధిస్తుందనేది తన గట్టి నమ్మకం. అలాగే జూనియర్ సైతం ‘జనతా గ్యారేజ్’ సినిమా బ్లాక్ బస్టర్ సాధించటం ఖాయం అనే నమ్మకంలో ఉన్నారు. దీని కారణంగా థియోటర్స్ విషయంలో బాక్సాపీస్ వద్ద కొంత గంధరగోళం ఏర్పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. అలాగే ఏ మూవీకి సరైన కలెక్షన్స్ వచ్చే అవకాశం లేదు. ‘జనతా గ్యారేజ్’ మూవీ నైజాం రైట్స్ ని దిల్ రాజు భారీగా కొన్నారు.


అందుకే నైజాంలో థియోటర్స్ ని తన హస్తగతం చేసుకోవాలని దిల్ రాజు ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. దీంతో ఇంకొక్కడు మూవీకి నైజాంలో థియోటర్స్ దొరికే పరిస్థితి లేదు. దీని కారణంగా జూనియర్ కి విక్రమ్ ఫోన్ చేసి…‘జనతా గ్యారేజ్’ కి ఆల్ ది బెస్ట్ చెప్పి తన మూవీని పోస్ట్ పోన్ చేసుంటున్నానని, ఇదంతా ఇండస్ట్రీ బాగుకోసమే అని అన్నారంట.


విక్రమ్ మాటలకి జూనియర్ ఒక్కసారిగా ఆశ్ఛర్యపోయాడు. ఇక సెప్టెంబర్ 2న సోలాగా వస్తున్న ‘జనతా గ్యారేజ్’ ఏ రేంజ్ కలెక్షన్స్ ని సాధిస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. అలాగే విక్రమ్ నటించిన ఇంకొక్కడు మూవీ సెప్టెంబర్ 8న భారీ ఎత్తున రిలీకి సిద్ధం అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: