టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ శ్రీనువైట్ల తెరకెక్కించిన చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అయితే తను తెరకెక్కించిన రీసెంట్ చిత్రాలు బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టడంతో స్టార్ హీరోలు శ్రీనువైట్ల కాంబినేషన్ కి కాస్త దూరంగా ఉన్నారు. బాద్ షా, ఆగడు, బ్రూష్ లీ వంటి చిత్రాలు శ్రీనువైట్ల కి కొంత నిరాశని మిగిల్చాయి. ఈ ఎఫెక్ట్ తో తన ఫిల్మ్ కెరీర్ కొంత డైలమాలో పడిండనే చెప్పాలి.


బ్రూస్ లీ మూవీ తరువాత పలువురు టాప్ హీరోల దగ్గరకి శ్రీనువైట్ల వెళ్ళినప్పటికీ...తను ఎక్స్ పెక్ట్ చేసిన రెస్పాన్స్ రాకపోయే సరికి...కథపై ఎక్కువ సమయాన్ని కేటాయించి మెగాహీరో వరుణ్ తేజ్ తో జతకట్టేందుకు సిద్ధం అయ్యాడు. ఇప్పుడు వరుణ్ తేజ్, శ్రీనువైట్ల కాంబినేషన్ కి సంబంధించిన మూవీ ప్రి ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక బ్రూస్ లీ ప్లాప్ అనంతరం శ్రీనువైట్ల, రవితేజా కాంబినేషన్ కోసం బాగా ట్రై చేశాడు.


కానీ రవితేజ మాత్రం కొన్ని మూవీల తరువాత అంటూ శ్రీనువైట్ల ని దూరం పెట్టాడని అంటారు.. రీసెంట్ గా రవితేజ, స్టార్ రైటర్ కోన వెంకట్ కాంబినేషన్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీకి కోన వెంకట్ కథని అందించగా, కె.ఎస్.రవీంద్ర దర్శకత్వం చేయనున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ బాబీ, కోనతో కలిసి స్క్రిప్టు పనుల్లో బిజిగా ఉన్నారు. కొద్దిరోజుల్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని అంటున్నారు.


అయితే నిజానికి శ్రీనువైట్ల కి రవితేజ ఛాన్స్ ని ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుతం రవితేజకి ఉన్న షెడ్యూల్స్ ని చూస్తుంటే మరో 3 సంవత్సరాల వరకూ శ్రీనువైట్లకి డేట్స్ ఇచ్చే పరిస్థితి కనిపించటం లేదు. వరుణ్ తేజ్ తో మిస్టర్ మూవీ తరువాత రవితేజతో ప్లాన్ చేసుకున్న శ్రీనువైట్ల ఆశలు ఇప్పట్లో నెరవేరేటట్టు లేవని అంటున్నారు. ఇక రవితేజ ప్రస్తుతం డైరెక్టర్ చక్రి కాంబినేషన్ లో ‘రాబిన్ హుడ్’ మూవీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్ళే ఛాన్స్ ఉందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: