‘జనతా గ్యారేజ్’ మూవీలో కాజల్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిపి ఒక ఐటమ్ సాంగ్ లో కనిపించబోతోంది అన్న వార్తలు ఎప్పుడో వచ్చాయి.  అయితే ఈ పాటకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయినా ఈ పాటలో కాజల్ ఎలా కనపడబోతోంది అన్న విషయానికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి స్టిల్స్ బయటకు రాలేదు.  

‘నేను పక్కా లోకల్’ అంటూ మాస్ ప్రేక్షకుల కోసం దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ చేసిన ఈ ఐటమ్ సాంగ్ షూటింగ్ ఈమధ్యనే పూర్తి అయింది.  ముక్కుకు పెద్ద ముక్కుపుడక పెట్టుకుని ఒక డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్న కాజల్ లుక్ చూసిన వారు అంతా ఆశ్చర్య పోతున్నారు.  ఈ పాట కోసం కాజల్ చాల మారిపోయినట్లు కనిపిస్తోంది.

ఈ పాట షూటింగ్ పూర్తి అయిపోవడంతో ఈ స్పెషల్ సాంగ్ కు సంబంధించిన ఒక స్పెషల్ టీజర్ మరో రెండు రోజులలో విడుదల చేసి ఈసినిమాకు మరింత హైక్ తీసుకు రావడానికి ‘జనతా గ్యారేజ్’ యూనిట్ తన ప్రయత్నాలు చేస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి.  సెంటిమెంట్ కోసం జూనియర్ సూచనతో కాజల్ ను ఈ పాట కోసం రంగంలోకి దింపడానికి ఆమెకు 50 లక్షల వరకు ముట్టచెప్పినట్లు టాక్.  

ఈ వార్తలు ఇలా ఉండగా ‘జనతా గ్యారేజ్’ విడుదల తేదీని ఒకరోజు ముందుకు జరిపినా మరో కష్టాల సుడిగుండంలో జూనియర్ సినిమా చిక్కుకుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.  సెప్టెంబర్ 1న అమావాస్య అవడంతో ఈ అమావాస్య సెంటిమెంట్ ను ఎలా తిప్పి కొట్టాలి అన్న ఆలోచనల మధ్య ‘జనతా గ్యారేజ్’ యూనిట్ తీవ్రంగా మధన పడుతోంది అని టాక్.  

ఈ మధ్య కాలంలో ఇటువంటి అమావాస్య సెంటిమెంట్లు ఎదురైనప్పుడు చాల సినిమాల దర్శక నిర్మాతలు ఆ సినిమాల విడుదల తేదీకి ముందు తమ సన్నిహితులకు ఒక స్పెషల్ షో వేసి వారిదగ్గర నుంచి టిక్కెట్ల డబ్బు కూడ తీసుకుని ఈ అమావాస్య గండం నుంచి గట్టుఎక్కిన సందర్భాలు ఉన్నాయి.  వెంకటేష్ ‘బాబు బంగారం’ విడుదల అయిన తేదీ మంచిరోజు కాకపోవడంతో ఇలాగే ఒక స్పెషల్ షోను వేసి ఈ సెంటిమెంట్ గండం నుండి గట్టు ఎక్కారు. 

ఇప్పుడు అదే పద్ధతిని కొనసాగిస్తూ ‘జనతా గ్యారేజ్’ యూనిట్ ఈసినిమా విడుదల తేదీకన్నా ముందుగానే ఆగష్టు 30న కాని లేదంటే 31న కానీ భాగ్యనగరంలో తమ సన్నిహితుల మధ్య ఓకే స్పెషల్ షోను వేసి ఈ అమావాస్య గండం నుంచి బయటకు రావాలని ‘జనతా గ్యారేజ్’ ప్రయత్నిస్తోంది అన్న వార్తలు వినపడుతున్నాయి. ‘జనతా గ్యారేజ్’ ఇంకా  రకరకాల సమస్యలను ఎదుర్కుంటూనే ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: