టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కు ఉన్న క్రేజ్ ఏంటో అందరికి తెలిసిందే. అయితే అలాంటి స్టార్ హీరో పక్కన ఛాన్స్ వస్తే కాదని ఓ కుర్ర హీరో సినిమాకు స్పెషల్ సాంగ్ నర్తించేందుకు సై అని జూనియర్ పరువు తీసేసింది హాట్ బ్యూటీ శృతి హాసన్. తారక్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న జనతా గ్యారేజ్ లో ఐటం సాంగ్ కోసం ముందు శృతి హాసన్ కోసం అడిగారట.


కాని జూనియర్ తో స్పెషల్ సాంగ్ చేసే ఉద్దేశం లేకనే మరో కారణమో కాని డేట్స్ అడ్జెస్ట్ కావట్లేదంటూ కారణాలు చెప్పి శృతి హాసన్ ఆ ఐటం సాంగ్ కాదనేసింది. ఇక ఆ ఛాన్స్ మరో హాట్ బ్యూటీ కాజల్ దక్కించుకుందనుకోండి. అయితే ఎన్.టి.ఆర్ స్పెషల్ సాంగ్ అంటే డేట్స్ అంటూ సాకు చెప్పిన శృతి హాసన్ ఇప్పుడు కర్ణాటక మాజి ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ హీరోగా చేస్తున్న జాగ్వార్ సినిమాలో స్పెషల్ సాంగ్ కు ఓకే చెప్పింది.


మరి కొత్త హీరో అయితే రెమ్యునరేషన్ గట్టిగా వర్క్ అవుట్ అవుద్దని ఒప్పుకుందో ఏమో గాని శృతి నిఖిల్ తో చేస్తున్న ఐటం సాంగ్ ఓ విధంగా ఎన్.టి.ఆర్ కు షాక్ ఇచ్చినట్టు అయ్యింది. శృతి కాదన్న తర్వాత చాలామందిని చూసి చివరకు కాజల్ తో అడ్జస్ట్ అయ్యాడు. ఒకవేళ జనతాలో కూడా శృతి స్పెషల్ సాంగ్ చేసుంటే సినిమాకు మరింత క్రేజ్ వచ్చి ఉండేడి.


ఇక వస్తున్న జాగ్వార్ సినిమా విషయానికొస్తే మొదటి సినిమానే 70 కోట్ల భారీ బడ్జెట్ ఓ వస్తున్న నిఖిల్ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించడం విశేషం. సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండేందుకు దాదాపు 2 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి మరి శృతి హాసన్ తో ఐటం సాంగ్ ప్లాన్ చేశారట.


ఇప్పటికే మహేష్ తో ఆగడు సినిమాలో ఐటం సాంగ్ తో అలరించిన శృతి ఇప్పుడు కొత్త హీరోతో ఆడి పాడనుంది. ఇక శృతి రెచ్చిపోవడం గురించి అందరికి తెలిసిందే. అవసరం అనుకుంటే హాట్ హాట్ గా కనిపించేందుకు ఏమాత్రం వెనుకాడని శృతి జాగ్వార్ మూవీతో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. సినిమా భారీ తనం చూస్తుంటే తెలుగులో స్ట్రైట్ సినిమాలా దించాలని భారీ ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: