‘బాహుబలి’ కోసం ప్రభాస్ తన పెళ్లిని త్యాగం చేసి గత మూడు సంవత్సరాలుగా కష్టపడుతూ ఉంటే ప్రభాస్ పెళ్ళి మాటను క్యాష్ చేసుకోవడానికి పూరిజగన్నాథ్ తమ్ముడు యంగ్ హీరో సాయి రామ్ శంకర్ చేస్తున్న ప్రయత్నాలు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి.  ఈమధ్యనే ఒక న్యూమరాలజిస్ట్ సలహాతో తన పేరును రామ్ శంకర్ గా మార్చుకున్నాడు పూరి తమ్ముడు సాయి రామ్ శంకర్.

‘డేంజర్’  సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో ఇప్పటి వరకు చాల సినిమాలలో నటించినా ఏ సినిమా అతడికి గుర్తింపు తీసుకు రాలేక పోవడంతో ఇక లాభం లేదనుకుని తన పేరు మార్చుకుని    'అరకు రోడ్‌‌లో' అనే సినిమాలో నటిస్తున్నాడు. థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సాంగ్‌ టీజర్‌ను యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఆవిష్కరించాడు. 

అయితే ఈ టీజర్ ను ఆవిష్కరించిన ప్రభాస్ కు అనుకోని షాక్ తగిలినట్లు తలుస్తోంది. ‘ఎప్పుడురా పెళ్ళి’  అనే ఈ సాంగ్‌ టీజర్ చూడగానే ప్రభాస్ షాక్ అయి ‘ఈ పాటను వింటూ ఉంటే ఈపాట  నా గురించే రాసినట్లుంది.’ అంటూ కామెంట్  చేయడంతో ఆ కార్యక్రమానికి వచ్చిన వారు అంతా ప్రభాస్ జోక్ కు తెగ నవ్వుకున్నట్లు టాక్. 

అంతేకాదు ఈసినిమాలోని మరో పాట 'గెడ్డం తెల్లబడి పోతావుందే’ ట్యూన్ విని ‘అరకురోడ్’ సినిమా అంతా తనపెళ్ళి  గురించి సెటైర్ గా మార్చేస్తున్నారా ? అని మరో  జోక్ ప్రభాస్ పేల్చి నట్లు తెలుస్తోంది.  రామ్‌ శంకర్‌, నిఖిషా పటేల్‌ హీరో హీరోయిన్లుగా శేషాద్రి క్రియేషన్స్‌ పతాకం పై వాసుదేవ్‌ దర్శకత్వంలో నిర్మించిన ఈసినిమా  ‘అరకురోడ్‌లో’ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది.

సహజంగా పూరీ తన తమ్ముడు సినిమాలకు తానే పాటలు వ్రాస్తూ ఉంటాడు.  అయితే ఈ సారి పూరి ఈ సినిమా విషయంలో ఏ మాత్రం పట్టించుకోకుండా యంగ్ డైరక్టర్ వాసుదేవ్‌ కు అన్ని భాధ్యతలు అప్పచెప్పి మరో సంచలనం చేస్తున్నాడు.  ఈ సినిమా కోసం పూరి తమ్ముడు తన పేరు కూడ మార్చుకున్న నేపధ్యంలో ఈ కొత్త పేరు అయినా తనకు కలిసి వస్తుందేమో అన్న ఆశతో ఉన్నాడు.

‘బాహుబలి 2’ షూటింగ్ లో బిజీగా ఉంటూ కూడ ప్రభాస్ ఈ టీజర్ లాంచింగ్ కు వచ్చాడు అంటే ప్రభాస్ పూరీల మధ్య ఉన్న సాన్నిహిత్యం మరోసారి రుజువైంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: