తెలుగు బుల్లితెరపై కనీ వినీ ఎరుగని రితిలో ప్రసారం అవుతున్న ప్రోగ్రామ్ ‘జబర్ధస్త్ ’కామెడీ షో. ఈ ప్రోగ్రామ్ తో ఎంతో మంది ఔత్సాహికులు ఇప్పుడు మంచి పోజీషన్లోకి వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు కమెడియన్లు అంటే కొద్ది మంది మాత్రమే కనిపించేవారు..కానీ ఈ మద్య జబర్ధస్త్ ప్రోగ్రామ్ హిట్ అవ్వడంతో చాలా మంది కమెడియన్లు వెండి తెరపై కూడా తమ సత్తా చాటుతున్నారు. దీంతో సీనియర్ల హవా కాస్త తగ్గిందని భావిస్తున్నారు. అయితే ఎప్పుడైతే జబర్ధస్త్ టీమ్ ఫామ్ లోకి వచ్చిందో ఇందులో ముఖ్యంగా వేణు, ధన్ రాజ్, శకలక శంకర్,చమ్మక్ చంద్ర,చంటి ఇలా కొంత మంది కమెడియన్లు జోరు బాగా పెరిగిందని వారి డిమాండ్ కూడా బాగా పెరిగిందని వార్తలు వస్తున్నాయి.
అంతే కాదు కొంతమంది సీనియర్ కమెడియన్ల కు తామే పోటీ అని ప్రచారాలు చేసుకోవడంతో సినియర్ కమెడియన్లు చాలా సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఎంతో కాలంగా తెలుగు పరిశ్రమలో తాము అభిమానులను నవ్వించి వారి ప్రశంసలు పొందామని ఈ మద్య వచ్చిన కమెడియన్లు తమకు తామే సాటి అని బిల్డప్ ఇచ్చుకోవడం ఎంతవరకు సబబు అని అంటున్నారు. ఆ మద్య సర్ధార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో శకలక శంకర్ ని పవన్ కళ్యాన్ చెంపదెబ్బ కొట్టినట్లు వార్తలు గుప్పుమన్నాయి.
అయితే దీనిపై శంకర్ క్లారిటీ ఇచ్చాడు..తనకు క్రమశిక్షన నేర్పించింది పవన్ కళ్యాన్ అని తనను కొట్టలేదని కాకపోతే మందలించారని అన్నారు. తర్వాత చమ్మక్ చంద్రపై కొన్ని ఆరోపణలు వచ్చాయి...ఓ అడల్ట్ యాంకర్ తనను వాడుకొని వదిలేసినట్లు తనకు డబ్బులు కూడా ఇవ్వలేదని సోషల్ మీడియాలో టామ్ టామ్ చేసింది. మొత్తానికి ఈ వ్యవహారంలో పెద్దలు జోక్యం చేసుకొని సర్ధుమణిగేలా చేశారు. ఇక ఇందులో వచ్చిన యాంకర్ల గురించి వేరే చెప్పనవసరం లేదు..వారి ఇప్పుడు టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. ఇలా జబర్ధస్త్ కామెడీ షోపై ఎన్నో సంచలన కథనాలు వెలువడ్డాయి. \