యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ‘జనతా గ్యారెజ్’ సెప్టెంబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతుంది. ఓ పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసుకుంటోన్న ఈ సినిమా, మరోవైపు ప్రమోషన్స్ పనులనీ కూడా భారీగా ప్లాన్ చేశారు. గతంలో ఎన్టీఆర్ నటించిన మూవీల కంటే ఈ మూవీపై ఆభిమానులు ఎక్కువుగా ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీకి సంబంధించిన సక్సెస్ పై ఎన్టీఆర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

ఎట్టిపరిస్థితుల్లో మార్కెట్ లో జనతా గ్యారేజ్ మూవీ ప్లాప్ కాకుడదనేది ఎన్టీఆర్ ఆలోచన. అలాగే కలెక్షన్స్ పరంగానూ జనతా గ్యారేజ్ మంచి పొజిషన్ లో ఉండాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే జనతా గ్యారేజ్ అవుట్ పుట్ మంచిగా రావాటంతో...ప్రమోషన్స్ కి సంబంధించిన విషయంలో ఎక్కడా ప్లాప్ కాకుడదని ఎన్టీఆర్ ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోషియల్ మీడియాలోనూ, ఎఫ్ ఎమ్ స్టేషన్స్, మీడియాలో జనతా గ్యారేజ్ ప్రమోషన్స్ ని జోరుగా చేస్తున్నారు.

ఇక నిర్మాతకి కి సైతం జనతా గ్యారేజ్ ప్రమోషన్స్ కి గురించి ఎన్టీఆర్ క్లియర్ మెసేజ్ ఇచ్చారంట. కచ్ఛితంగా జనతా గ్యారేజ్ కి మంచి ప్రమోషన్స్ ని అందించాల్సిందిగా కోరారు. దీంతో నిర్మాత జనతా గ్యారేజ్ మూవీకి భారీ ప్రమోషన్స్ ని ప్లాన్ చేశారు. ప్రమోషన్స్ కోసమే దాదాపు 80 లక్షల రూపాయలను ఖర్చు పెడుతున్నట్టుగా చిత్ర యూనిట్ నుండి అందుతున్న సమాచారం.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని గ్రాండ్ గా తెరకెక్కించింది. ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. కొరటాల కచ్ఛితంగా హాట్రిక్ ని కొడతాడనేది ఇండస్ట్రీ టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: