టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ హీరోగా నెంబర్ వన్ స్థానంలో ఉన్న హీరో ప్రిన్స్ మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్, దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా మురుగదాస్, ప్రిన్స్ మహేష్ బాబు పై కామెంట్స్ చేశారు. ఇది మహేష్ కి ప్లస్ అయినప్పటికీ..ప్రిన్స్ మాత్రం ఒక విషయంలో మురుగదాస్ కి అంత సీన్ ఇవ్వలేదని అంటున్నారు.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మహేష్‌తో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉందని మురుగదాస్ చెప్పుకువచ్చారు. అలాగే “షాట్ పూర్తి కాగానే మహేష్ నన్ను చూస్తారు. నా ముఖంలో ఏమాత్రం అసంతృప్తి కనబడినట్లు అనిపించినా, ఆయనే స్వయంగా ఇంకో టేక్‍కి వెళదాం అనేస్తూంటారు.” అని చెప్పుకువచ్చారు. అయితే చిత్రయూనిట్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం..మహేష్ బాబు మరోసారి రీ టేక్ ని కోరుకునే వాడు కాదంట.

ఆ ఛాన్స్ డైరెక్టర్ కి ఇవ్వటం మహేష్ కి అస్సలు ఇష్టం ఉండదని అంటున్నారు. మురుగదాస్ ఏం చెబుతున్నాడో ముందుగానే రిహార్సల్ చేసుకొని...ఎక్కువుగా శ్రమించి టేక్ కి వెళ్ళేవాడట. దాదాపు మురుగదాస్ చెప్పిన సీన్స్ అన్నీ సింగిల్ టేక్ లోనే జరుగుతాయి. ఒకవేళ మురుగదాస్ మళ్ళీ రీ టేక్ అని కోరదామనుకునే లోపు మహేష్ బాబే స్వయంగా రీటేక్ అని అనటం ఈ డైరెక్టర్ కి షాకింగ్ లా ఉంది. మహేష్ బాబు లాంటి కంఫర్ట్ ఉన్న హీరోని తను ఇప్పటి వరకూ చూడలేదని మురుగదాస్ చెప్పటం ఇక్కడ విశేషం.

ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషియల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మురుగదాస్ నేషనల్ డైరెక్టర్ కావటంతో...ప్రిన్స్ మహేష్ బాబు సైతం తన యాక్టింగ్ లో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే మురుగదాస్ నుండి మరోసారి రీటేక్ ని కోరుకోవటం లేదు. తనకి అంత సీన్ కూడ ఇవ్వటం లేదు. దటీస్ ప్రిన్స్ అని ఫ్యాన్స్ సైతం ముచ్ఛటగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: