యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ మరో వారం రోజుల్లో రిలీజ్ అవుతుంది. నేచర్ లవర్ గా కనిపించనున్న జూనియర్ ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టేయడం గ్యారెంటీ అని అందరు ఫిక్స్ అయ్యారు. అయితే మైత్రి మూవీ మేకర్స్ సినిమాను నిర్మించగా సినిమాను ఇప్పటికే అన్ని ఏరియాల్లో బిజినెస్ చేసేశారని తెలుస్తుంది.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చివరి నిమిషంలో ఈ సినిమా మొత్తం థియేట్రికల్ రైట్స్ ఈరోస్ వారు కొనేశారని ఎక్స్ క్లూజివ్ టాక్. అయితే సడెన్ గా చివరి నిమిషంలో ఈరోస్ వారికి అమ్మేయడంతో కన్ ఫ్యూజన్ లో పడ్డారు ఫ్యాన్స్. ఇప్పటికే ట్రైలర్స్ తో అంచనాలను పెంచేసిన జూనియర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు వంద కోట్ల టార్గెట్ పెట్టుకున్నాడు.


మరి అలా అయితే లాస్ట్ మినిట్ లో ఈరోస్ తో డీల్ ఎలా ఓకే అన్నాడో అర్ధం కావట్లేదు. ఇక వినిపిస్తున్న మరో టాక్ ఏంటంటే సినిమాకు ఊహించని రేంజ్లో ఫ్యాన్సీ ఎమౌంట్ ఆఫర్ చేయడంతో జూనియర్ ను ఒప్పించి కొరటాల శివ, మైత్రి మూవీ మేకర్స్ ఈ డీల్ సెట్ చేసుకున్నారట. సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను కంప్లీట్ చేసుకుంది.


సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. నేచర్ లవర్ గా సరికొత్త పాత్రలో కనిపించబోతున్న ఎన్.టి.ఆర్ సినిమాతో రికార్డుల చెడుగుడు ఆడటం ఖాయమనేస్తున్నారు. ఇక కొన్ని కంపెనీలు జనతా గ్యారేజ్ రిలీజ్ కోసం ఎంప్లాయీస్ కు హాలిడే కూడా ఇవ్వడం విశేషం.


కబాలి సినిమా తర్వాత ఎంప్లాయీస్ కు హాలిడే ఇచ్చి మరి ఎంకరేజ్ చేసిన సినిమా జనతా గ్యారేజ్ మాత్రమే. మరి భారీ అంచనాలతో వస్తున్న గ్యారేజ్ ఏమాత్రం అంచనాలను అందుకుంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: