సామాన్యంగా ఒక టాప్ హీరో సినిమా విడుదల అవుతున్నప్పుడు ఆసినిమా బ్లాకు బస్టర్ హిట్ కావాలని ఆ సినిమా హీరో అభిమానులు అంతా ఆశిస్తూ  కలలు కంటూ ఉంటారు.  అయితే వచ్చే వారం విడుదల కాబోతున్న ‘జనతా గ్యారేజ్’ బ్లాకు బస్టర్ హిట్ కావాలని టాలీవుడ్ లోని టాప్ హీరోల అభిమానులు అంతా కోరుకుంటున్నట్లు వార్తలు రావడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలోకి వెళ్ళితే ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే తానూ తీసిన సినిమాలతో ప్రభాస్ మహేష్ లకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన నేపధ్యంలో ఇప్పుడు శివ మహేష్ ప్రభాస్ అభిమానులకు కూడ డార్లింగ్ డైరెక్టర్ గా మారిపోయాడు.  దీనికితోడు మహేష్ తో  కొరటాల వచ్చే ఏడాది మరో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు అనే వార్తలు వస్తూ ఉండటంతో కొరటాల తీసిన ‘జనతా గ్యారేజ్’ బ్లాకు బస్టర్ హిట్ కొట్టాలని ప్రభాస్ అభిమానులతో పాటు మహేఅష్ అభిమానులు కూడ చాలా తీవ్రంగా కోరుకుంటున్నారని టాక్. 

ఇప్పటికే ఈ సినిమా పై విడుదల కాకుండానే పాజిటివ్ టాక్ నడుస్తు ఉండటంతో ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్స్ సినిమాగా మారుతుంది అని జూనియర్ అభిమానులతో పాటు ప్రభాస్ మహేష్ అభిమానులు కూడ భావిస్తున్నారు అంటే ‘జనత గ్యారేజ్’ మూవీ టాప్ హీరోలను ఏవిధంగా ఏకం చేసిందో అర్ధం  అవుతుంది.  

ఇది ఇలా ఉండగా జపాన్ లోని ప్రముఖ ఒట్సుక (OTSUKA) లాంటి ప్రముఖ సాఫ్ట్ వేర్  కంపెనీలు  కూడ తమ ఉద్యోగులు ‘జనతా గ్యారేజ్’  సినిమాను చూసే విధంగా సెప్టెంబర్ 1వ తేది  తమ కంపెనీకి సెలవు ప్రకటిస్తూ జూనియర్ ను తెలుగు తలైవా గా అభివర్ణించారు అంటే జూనియర్ క్రేజ్ జపాన్ ను కూడ విధంగా షేక్ చేస్తుందో అర్ధం అవుతోంది.  ఇది ఇలా ఉండగా ఈ సినిమా నిన్న సెన్సార్ పూర్తి చేసుకోవడంతో ఈసినిమాకు సంబంధించి ఒక ఆ శక్తికర న్యూస్ బయటకు వచ్చింది. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా నిడివి కొద్దిగా పెద్దదిగా మారడమే కాకుండా సినిమాలో ఎక్కడా ఎంటర్ టైన్మెంట్ తక్కువగా ఉండి సెంటిమెంట్ భారీ స్థాయిలో ఉండటంతో మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా చేరువ అవుతుందా అన్న అనుమానాలు కొందరు వ్యక్త పరుస్తున్నారు.  

అయితే ప్రస్తుతం ఈ సినిమాకు నడుస్తున్న మ్యానియా ఈ చిన్నచిన్న లోపాలను కవర్ చేస్తుంది అన్న మాటలు కూడ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: