పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలన వ్యక్తిగా మారాడు. ఒకవైపు తన అభిమాని హత్య..మరోవైపు రాజకీయ ప్రస్థానంలో కీలక అడుగు. ఇలా పవన్ కళ్యాణ్ ప్రయాణం ఎటువైపు వెళుతుందో తెలుసుకోవటానికి అటు అభిమానులు, ఇటు రాజకీయ నాయకులు అంతా తెగ ఆసక్తని కనబరుస్తున్నారు. సాయంత్రం తిరుపతిలో జరగబోయే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రసంగం పై తెలుగు రాష్ట్రాలు ఆసక్తిని చూపుతున్నాయి.


ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ చేయబోతున్న ప్రసంగంలో ఎవరిని టార్గెట్ చేయనున్నారు? అనేది ఇక్కడ ఆసక్తిగా మారింది. నవ్యాంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న పార్టీపై బహిరంగంగా పవన్ కళ్యాణ్ కామెంట్ చేసే ధైర్యం తనకి ఉందా? లేక తన ఉనికిని చాటుకోవటానికి పెడుతున్న మీటింగా? అంటూ అందరూ బాహాటంగానే చర్ఛించుకుంటున్నారు. జనసేన పార్టీలో కీలక రాజకీయ నాయకులు ఎవ్వరూ లేనప్పటకీ...అభిమానులే కీలక బాధ్యతలు చేపడుతున్నారు.


పవన్ కళ్యాణ్ చేపడుతున్న అన్నీ బహిరంగ సభలకి అభిమానులే అన్ని విధాలుగా కార్యక్రమాలను చూసుకుంటున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో అభిమానులే పవన్ కళ్యాణ్ కి బలం, బలహీనత. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ అభిమానులపై గత కొంత కాలంగా ఇండస్ట్రీలోనూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.


పవర్ స్టార్ అభిమానులు ఆడియో ఫంక్షన్స్ ని గంధరగోళం చేస్తున్నారంటూ టాక్స్ ని స్ర్పెడ్ చేస్తున్నారు. ఇటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ తన అభిమానులను ఉద్ధేశించి కీలక వాఖ్యలు కూడ చేస్తారనే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ మరి కొద్ధి గంటల్లో తిరుపతిలో చేసే ప్రసంగంపై అందరిలో ఉత్కంఠత మొదలైంది. కచ్ఛితంగా రాజకీయ పార్టీలను టార్గెట్ చేస్తారనేది ప్రముఖుల వద్ద నుండి వినిపిస్తున్న సమాచారంగా తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: