టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రోజురోజుకి పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. గతంలో ఉన్న ప్యామిలీ వాతావరణం ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కడా కనిపించటం లేదు. ఎవరు పెద్ద? ఎవరు చిన్న?అనే తేడా ఎక్కడా లేదు. ప్రతి ఒక్కరూ వారి సామర్ధ్యాలకి చూపించటానికి ప్రయత్నిస్తున్నారు. సమయం చూసి ఒక్కసారిగా ఎదగాలని చూస్తున్నారు.

ఇక పరిస్థితి చేతులు దాటిపోతుందనుకున్న సమయంలో బహిరంగ వాగ్వాధాలకి సైతం దిగటానికి సిద్ధపడుతున్నారు. తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగిన సంఘటనే ఇందుకు ఉదాహరణ అని అంటున్నారు. ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్, అలాగే నిర్మాత నట్టికుమార్‌ మధ్య జరిగిన గొడవ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్ఛనీయాంశంగా మారింది. వీరిద్దరి విషయంలో సినీ ఇండస్ట్రీలో పెద్దలు సైతం జోక్యం చేసుకునేందుకు వెనకాడుతున్నారు.

ఇద్దరూ ఇండస్ట్రీలో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తులు కావటంతో సినీ పెద్దలు కనీసం ఈ విషయంలో ఏం జరిగింది అని ప్రశ్నించే ఆసక్తి కూడ చూపటం లేదు. వీరిద్దరి గొడవలు చూస్తుంటే ఇండస్ట్రీలో జరుగుతుంది ఏంటి అనే దానిపై పెద్దలకి సైతం స్పష్టత తెలియకుండా ఉందని అంటున్నారు. ఈ తరహా పద్ధతి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సమగ్రత దెబ్బతీసే విధంగా ఉందని అంటున్నారు. అందుకే ఈ తరహా సమస్యలకి పరిష్కారం చూపటానికి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించని ప్రత్యేకమైన న్యాయవ్యవస్థని ఏర్పాటు చేయాలని కొందరు వ్యక్తులు కోరుకుంటున్నారు.

సమస్యను బయటను రాకుండానే అంతర్గతంగా సమసి పోయేందుక ప్రత్యేకమైన కమిటీ ఇందుకు తోడ్పడాలనేది వీరి అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ... సి. కల్యాణ్‌, నట్టికుమార్ ల వ్యవహారం ఇప్పుడు ఎటు దారితీస్తుందో అనేది ఇండస్ట్రీలో వర్గాలను కలవర పెడుతున్న విషయంలా ఉంది. వీరిద్దరి వ్యవహారంలో పలు హీరోయిన్స్ కి సంబంధించిన పేర్లు కూడ బయటకు రావటం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: