ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. అయితే ఈ మూవీలో మహేష్ బాబుకి ఓ న్యూస్ షాకింగ్ ని ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం మహేష్ బాబు...మురుగదాస్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ని వేగంగా జరుపుకుంటుంది.


అయితే డైరెక్టర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని నేషనల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటికే డైరెక్టర్ మురుగదాస్ పలు చిత్రాలని తెరకెక్కించి నేషనల్ మార్కెట్ లో మంచి క్రేజ్ ని తెచ్చుకున్నాడు. ముఖ్యంగా అమీర్ ఖాన్ తో తెరకెక్కెంచిన గజినీ మూవీతో మురుగదాస్ కి బాలీవుడ్ మార్కెట్ లోనూ క్రేజ్ ఏర్పడింది.


అందుకే ప్రస్తుతం తను తెరకెక్కిస్తున్న మహేష్ బాబు సినిమాని సైతం తెలుగు,తమిళ్, హిందీ మార్కెట్ లకి అనుగుణంగా తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే డైరెక్టర్ మురుగదాస్ ఈ మూవీలో మహేష్ బాబుతో వచ్చే కాంబినేషన్ ఆర్టిస్ట్ ల కోసం ఎక్కువుగా తమిళ ఇండస్ట్రీ ఆర్టిస్ట్ లకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అలాగే బాలీవుడ్ నుండి కొంత మంది ఆర్టిస్ట్ లను తీసుకున్నారు. ఇక తెలుగు మార్కెట్ నుండి తక్కువ మంది ఆర్టిస్ట్ లు మహేష్ మూవీలో నటిస్తున్నారు.


పేరుకి తెలుగు హీరోనే కానీ...ఎక్కువ మంది ఆర్టిస్ట్ లు తమిళ, హిందీ ఆర్టిస్ట్ లే ఉండటం విశేషం. మురుగదాస్ చెప్పిన కథ బాగుండటంతో మహేష్ సైతం ఆర్టిస్ట్ ల సెలక్షన్స్ విషయంలో పెద్దగా పట్టించుకోవటం లేదు. ఇక తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న సీన్స్ లో ఎక్కవ మంది తమిళ కో ఆర్టిస్ట్ లే తనతో నటించటం చూసి కొద్దిగా షాక్ అయ్యాడని తెలుస్తుంది. అందుకే మహేష్ బాబు ని చుట్టుముట్టిన తమిళులు. అంటూ చిత్ర యూనిట్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: