అక్కినేని నాగచైతన్య, సమంతల లవ్ మొన్నటిదాకా హాట్ టాపిక్ గా నడిచింది. ఇద్దరు కలిసి ఎక్కడెక్కడో తిరగడం తీరా ఏంటి మ్యాటర్ అంటే మాత్రం నోరు విప్పకపోవడం మాములే. దాదాపు వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అన్నట్టు వార్తలు వస్తున్నా వేటికి ఇంతవరకు ప్రూఫ్ దొరకలేదు. కాని రీసెంట్ గా నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు వెడ్డింగ్ లో మాత్రం అక్కినేని ఫ్యామిలీతో సమంత రావడం చూసి ఇక అంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు. పైకి కాదు లేదు అని కనబడుతున్నా చైతు, సమంతల ప్రేమ ఇక పెళ్లిపీటలెక్కడమే తరువాయి అన్న పరిస్థితి కనబడుతుంది.


దానికి సాక్ష్యంగానే అక్కినేని ఫ్యామిలీతో సమంత ఆ ఈవెంట్ కు అటెండ్ అవ్వడం అంతేకాదు తాను హీరోయిన్ లా కాకుండా ఓ సగటు అమ్మాయిలా వచ్చిన తీరు కూడా దీనికి కారణం అనిపిస్తుంది. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంత ఆ తర్వాత ఆటోనగర్ సూర్య, మనం సినిమాలతో చైతుతో నటించి అతనితో మరింత బంధాన్ని పెంచుకుంది. ఇక ఇద్దరి అభిరుచులు కలవడంతో ఇద్దరు కలిసి తిరగడం స్టార్ట్ చేశారు. పెన్ను అరిగేదాకా, నోరు నొప్పెట్టే దాకా మీడియా అరచి గోల చేసినా వారు మాత్రం నోరు తెరవలేదు.


ఇక నాగార్జున మాత్రం తన కొడుకులిద్దరు వారి పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు ఇష్టమే అనేశాడు. ఇక నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు వెడ్డింగ్ ఈవెంట్ లో నాగార్జున, నాగచైతన్య, సమంతల, అఖిల్ ఒకే చోట ఉండటం అందరికి షాక్ ఇచ్చింది. అంటే బయటకు చెప్పట్లేదు కాని అక్కినేని ఫ్యామిలీ వారి పెళ్లికి సన్నాహాలు చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ ఫోటో సాక్ష్యం ఒక్కటి చాలాదా అక్కినేని ఫ్యామిలీలో సమంత కలిసిపోయిందని.


మొత్తానికి అనుకున్న విధంగా చైతన్య, సమంతలు తమ ప్రేమను గెలిపించుకున్నారని అనిపిస్తుంది. మరి ఇక ఆ పెళ్లి ఘట్టం కూడా కానిచ్చేస్తే ఎంచక్కా మిగతా వారికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఉంటుంది. ఈ విషయంపై క్లారిటీ వచ్చేది ఎప్పుడో.. నాగచైతన్య, సమంతలు ఈ విషమపై ఎలా స్పందిస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: