‘జనతా గ్యారేజ్’  సినిమా పై ఒకవైపు పాజిటివ్ టాక్ రోజురోజుకి పెరిగిపోతూ ఉంది.  అయితే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాక కూడ ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు చేస్తున్న రిపేర్లు చేస్తూ ఉంటే ‘జనతా గ్యారేజ్’ విషయంలో కొరటాల ఎంత అతి జాగ్రత్తలు తీసుకుంటున్నాడో అర్ధం అవుతోంది.  

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా ర‌న్ టైమ్ విష‌యంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకొంటున్నారు అని టాక్.  నిడివి ఏమాత్రం ఎక్కువైనా జ‌నాల‌కు బోర్‌ కొట్టేస్తుంది అన్న నేపధ్యంలో ‘జ‌న‌తా గ్యారేజ్’  ర‌న్ టైమ్ విష‌యంలో చిత్ర‌ బృందం చాలా జాగ్ర‌త్త‌లు తీసుకొంటోంది.  

ఒక‌టికి ప‌దిసార్లు సీన్లు చెక్ చేసుకొని నిడివి త‌గ్గించుకొనే ప్ర‌య‌త్నంలో ఉంది అన్న మాటలు వినపడుతున్నాయి. ఇప్పటికే మోహ‌న్ లాల్‌కి సంబంధించిన రెండు సీన్ల‌ను క‌త్తిరించేశారు అని తెలుస్తోంది.  అదేవిధంగా  అజ‌య్‌, బ్ర‌హ్మజీల‌పై తెర‌కెక్కించిన సీన్లు కూడా ట్రిమ్ చేశార‌నే మాటలు వినిపిస్తున్నాయి.  

మొత్తానికి చివ‌రి నిమిషాల్లో 6 నిమిషాల నిడివి త‌గ్గిన‌ట్టు స‌మాచారం. అలా త‌గ్గించాకే ర‌న్‌ టైమ్ కాస్త కంట్రోల్‌కి వ‌చ్చింది అని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇప్పుడు ఈ సినిమా 2గంట‌ల 25 నిమిషాల‌కు కుదించార‌ని తెలుస్తోంది. 

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి బుధ‌వారం నాడు వేయబోయే ఫ్యాన్స్ షోల‌కు సంబంధించిన హంగామా కూడా అప్పుడే మొద‌లైపోయింది. అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు షో ఉంటుందా? లేదంటే తెల్ల‌వారుఝామున 4 గంట‌ల‌కు వేద్దామా అనే ఆలోచనలలో ఈ సినిమా దర్శక నిర్మాతలు ఉన్నారని టాక్.

అయితే ‘శ్రీమంతుడు’ సినిమాకి తెల్ల‌వారుఝామున స్పెషల్ షో వేసిన నేపధ్యంలో ఇప్పుడు ‘జనతా గ్యారేజ్’ విషయంలో కూడ అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతారు అని తెలుస్తోంది.  ఇది ఇలా ఉండగా ఇప్పుడు సోషల్ మీడియాలో అదే విధంగా ఛానల్స్ లో హోరేత్తిస్తున్న ‘దివి నుంచి దిగివచ్చావా యాపిల్ బ్యూటీ.’ పాట చిత్రీకరణ చూసి జూనియర్ అభిమానులు బుల్లితెరమీద చూస్తుంటే కళ్లు జిగేల్మంటున్నాయి. మరి వెండి తెర మీద ఎలా ఉంటుందో అంటూ కలలు కంటున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: