సూపర్ స్టార్ రజినికాంత్ తో సినిమా తీయాలని ఏ దర్శకుడికి మాత్రం ఉండదు చెప్పండి. రజిని సినిమా అంటే అదో గొప్ప ఆఫర్ అన్నట్టే. ఇక ఆ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న డైరక్టర్స్ లిస్ట్ లో అందరు ఉంటారు. అయితే లక్కీగా రజినికాంత్ ఆఫర్ తగిలితే అక్కడ నుండి స్టార్ తిరిగినట్టే. ఇప్పుడు ఆ లక్కీ ఛాన్స్ డైరక్టర్ గౌతం మీనన్ దక్కించుకున్నాడని టాక్.


విలక్షణ సినిమాలతో దర్శకత్వ ప్రతిభను చాటుతున్న గౌతం మీనన్ త్వరలో సూపర్ స్టార్ రజినిని డైరెక్ట్ చేయబోతున్నాడని కోలీవుడ్ హాట్ న్యూస్. ఇప్పటికే రజినికి కథ వినిపించే క్రమంలో గౌతం మీనన్ రజినిని కలిసినట్టు తెలుస్తుంది. అయితే రజినికి కేవలం లైన్ మాత్రమే చెప్పాడట ఫుల్ స్క్రిప్ట్ తో వస్తే చూద్దాం అన్నాడని తెలుస్తుంది.


ఇక ఈ మధ్య ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన కబాలి కోలీవుడ్లో హిట్ అయినా మిగతా భాషల్లో మళ్లీ నిరాశే పరచింది. అందుకే ఈసారి ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా రజిని సినిమా కథ విషయంలో నిర్ణయం తీసుకుంటున్నాడట. అంతేకాదు తన కథల విషయంలో ఇన్నాళ్లు వేరే వాళ్ల ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువ ఉండేది ఇకనుండి అలా జరుగకుండా చూస్తున్నాడట. 


ఇక గౌతం వాసుదేవ మీనన్ తమిళంలో స్టార్ హీరోలతో కలిసిచేసిన సినిమాలు మంచి రిజల్ట్ వచ్చాయి. అంతేకాదు గౌతం సినిమాలంటే తెలుగులో కూడా మంచి  మార్కెట్ ఉంటుంది. అందుకే గౌతం చెప్పిన కథ పట్ల ఆలోచన చేస్తున్నాడట రజినికాంత్. అయితే మరో పక్క కోలీవుడ్ లో మాత్రం గౌతం కేవలం కథ సిద్ధం చేశాడు కాని రజినిని కలవలేదు అని టాక్.


ఏది ఏమైనా క్రేజీ కాంబినేషన్లో సినిమా అంటే అది నిజంగానే సిని అభిమానులకు పండుగే. ప్రస్తుతం శంకర్ డైరక్షన్లో వస్తున్న రోబో 2.0 షూటింగ్ లో పాల్గొంటున్న రజిని ఈసారి కాస్త ఎక్కువ రోజులు ఈ షెడ్యూల్ కు పనిచేయాల్సి ఉందట.  



మరింత సమాచారం తెలుసుకోండి: