'కాటమరాయుడు' షూటింగ్ మొదలైంది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా డాలీ దర్శకత్వంలో 'కాటమరాయుడు' చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది. 16 రోజులపాటు జరిగే ఈ షెడ్యూల్ లో పవన్ .. అలీ .. రావు రమేష్ .. అభినవ్ సింగ్ తదితరులు పాల్గొననున్నారు. ఈ పాత్రలపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. శరత్ మరార్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో, శ్రుతిహాసన్ కథానాయికగా అలరించనుంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతోంది. 



ఆన్‌లైన్‌లో ‘బాహుబలి-2’ ఫొటోల హంగామా


దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి విజువల్‌ వండర్‌ ‘బాహుబలి: ద కన్‌క్లూజన్‌’కు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇప్పటికే యుద్ధ సన్నివేశాలు సహా కీలక భాగం షూటింగ్‌ పూర్తయినట్లు సమాచారం. అయితే రెండో భాగానికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా కొండల మధ్య తెరకెక్కించే సన్నివేశాలకు సంబంధించిన ఏర్పాట్ల ఫొటోలున్నాయి. ప్లాన్ ప్రకారం చిత్రీకరణ చేస్తూ షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలు బయటకు రాకుండా రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎంత అప్రమత్తంగా ఉన్నా ఈ ఫొటోలు ఆన్‌లైన్‌లోకి వచ్చేశాయి.

'జాగ్వార్' పబ్లిసిటీ ఖర్చు 7 కోట్లు..!


మాజీ ప్ర‌ధాని దేవెగౌడ మ‌న‌వ‌డు నిఖిల్ కుమార్ హీరోగా మహాదేవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, జగపతిబాబు .. రమ్యకృష్ణ ముఖ్యమైన పాత్రలను పోషించిన చిత్రం 'జాగ్వార్.   మధ్య కాలంలో భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రాల జాబితాలోకి 'జాగ్వార్' చేరిపోయింది. నిఖిల్ కుమార్ .. దీప్తి జంటగా 75 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాను తీర్చిదిద్దారనే టాక్ వినిపిస్తోంది. నిఖిల్ కుమార్ మొదటి సినిమాకే ఈ స్థాయిలో ఖర్చు చేయడం అంతటా హాట్ టాపిక్ గా మారిపోయింది. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను అక్టోబర్ 6న తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి భారీస్థాయిలో పబ్లిసిటీ చేయాలని నిర్ణయించుకున్నారట. కేవలం పబ్లిసిటీ కోసమే 7 కోట్లు కేటాయించినట్టు చెప్పుకుంటున్నారు.  


మిస్టర్ 420 రిలీజ్ డేట్ ఫిక్స్


వరుణ్ సందేశ్ , ప్రియాంక భరద్వాజ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం మిస్టర్ 420. ఎస్‌ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ  చిత్రం సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ అందుకుంది., సెప్టెంబర్ 30న మిస్టర్ 420ని రిలీజ్‌కి రెడీ చేస్తున్నట్టు నిర్మాతలు తెలియజేశారు.. అయితే సెప్టెంబర్ 30న రామ్ నటించిన హైపర్ చిత్రం కూడా విడుదలకి సిద్ధం కాగా, ఈ రెండింటి మధ్య పోటీవాతావరణం నెలకొనేలా కనిపిస్తోంది.


న్యూడ్ సీన్స్ పై రాధికా స్పంద‌న‌


బాలీవుడ్‌ నటులు రాధికా ఆప్టే, తనిష్టా ఛటర్జీ, సుర్వీన్‌ చావ్లా, అదితి గుప్తా, ఆదిల్‌ హుస్సేన్‌ ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం ‘పార్చ్‌డ్‌’. ఈ మూవీలో రాధికా ఆప్టే నగ్నంగా నటించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇది స్టోరీలో భాగమని, దేశంలోని సాంఘిక దురాచారాల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తర్వాత చిత్రయూనిట్ చెబుతోంది. అయితే తాజాగా ఈ నగ్న సన్నివేశం లీక్‌ అవడంపై రాధికా ఆప్టే మాట్లాడింది. ‘ఇది జరిగినప్పుడు నేనేమీ స్పందించలేదు. నిజంగా చెప్పాలంటే.. ఏ చిత్రంలోని నగ్న సన్నివేశాలైనా అంతర్జాలంలో దొరుకుతున్నాయి. నేను ఈ సినిమాలో నటించాను. ప్రతి ఒక్కరు ఈ చిత్రం చూడాలని కోరుకుంటున్నా. నేను ఈ సినిమా చేయాలి కానీ దీన్ని బహిరంగంగా ప్రదర్శించకూడదు అని ఎప్పుడూ అనుకోలేదు. అలా అనుకుంటే అర్థం లేదు కదా?’ అని రాధికా ఆప్టే సమాధానం ఇచ్చింది. పితృస్వామ్యం, స్త్రీల పట్ల ద్వేషం లాంటి సమస్యలపై ఓ మారుమూల పల్లెటూరుకు చెందిన నలుగురు అమ్మాయిలు సాగించిన పోరాటమే ‘పార్చ్‌డ్‌’. ఇప్పటికే 7 దేశాల్లో విడుదలైన ఈ చిత్రం శుక్రవారం భారత్‌లో విడుదల కానుంది.


శ్రీవారికి తలనీలాలు సమర్పించిన నమ్రత


సూపర్‌స్టార్ మహేష్ భార్య నమ్రత తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కొడుకు గౌతమ్‌, కూతురు సితారతో కలసి స్వామివారి దర్శనానికి వెళ్లారు. ఆలయ అధికారులు నమ్రత ఫ్యామిలీకి ఘన స్వాగతం పలికారు. స్వామివారికి నమ్రత ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలనను అందజేశారు. నమ్రతను గమనించిన మహేష్ అభిమానులు నమ్రతతో ఫొటోలు దిగేందుకు ప్రయత్నించారు. శ్రీవారికి తలనీలాలు సమర్పించడంతో ఫొటోలు దిగేందుకు నమ్రత ఇబ్బంది పడ్డారు. చున్నీతో తలను కవర్ చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: