తెలుగు ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోడ్కర్ ఒకరు.   ఇప్పటి వరకు అన్యోన్యమైన జంటల్లో వీరు ఒకరు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు గౌతమ్ కృష్ణ, సితార. టాలీవుడ్ లో ప్రస్తుతం నెంబర్ వన్ రేసులో ఉన్నారు మహేష్ బాబు. గత సంవత్సం కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీమంతుడు’మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా చెప్పుకోవచ్చు..అంతే కాదు 100 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రం కూడా ఇదే.  ప్రతి సంవత్సరం షూటింగ్ విరామం సమయంలో మహేష్ తన కుటుంబంతో విహార యాత్ర కోసం విదేశాలకు వెళ్తుంటారు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు మహేష్ బాబు.

మహేష్ బాబు సతీమణి హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ తిరుమల శ్రీవారి సేవలో తరించారు. మొక్కు ఉండటంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహేష్ బాబు భార్య నమ్రత తల నీలాలు సమర్పించి ఆ మొక్కు తీర్చుకుంది . ఇదే సందర్భంలో త్వరలో తన భర్త తీయబోయే చిత్రం మంచి ఘన విజయం సాధించాలని కోరుకున్నది కాబోలు.  నమ్రతతో పాటు కుమారుడు గౌతమ్ కృష్ణ, కుమార్తె సితార, మెహర్ రమేష్ కొందరు కుటుంబ సభ్యులు స్వామి వారిని దర్శించుకున్నాడు.  

నమ్రత అక్క ఒకప్పటి హీరోయిన్ శిల్పా శిరోద్కర్ , అలాగే దర్శకులు మెహర్ రమేష్ లు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు . ఇక మహేష్ కుటుంబాన్ని చూడటానికి భక్తులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. మహేష్ కు చెన్నై లో షూటింగ్ ఉండటంతో నమ్రత పిల్లలతో కలిసి దైవ దర్శనానికి వెళ్ళింది. మహేష్ కుటుంబాన్ని చూడటానికి జనాలు ఎగబడటంతో  నమ్రతా తన చున్నీని తలపై వేసుకుని తొందరగా వెళ్ళిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: