తెలుగు లో ఇతర భాషలకు చెందిన హీరోయిన్ల చాలా మంది వచ్చారు కానీ అందులో ఎక్కవ పాపులారిటీ సంపాదించిన హీరోయిన్లు అతి కొద్ది మంది మాత్రమే. ఇక పంజాబీ బ్యూటీ చార్మీ 2001 లో నీతోడు కావాలి చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అప్పటికీ ఈ అమ్మడి వయసు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. తొలి తెలుగు చిత్రం అంతగా విజయం సాధించకపోయినప్పటికీ ఛార్మికి వెంటనే కాదల్ కిసు కిసు అనే తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం విజయవంతమవ్వటంతో ఆమెకు వెను వెంటనే కాదల్ అళివతిల్లై, ఆహా, ఎత్న అళగు తమిళ చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. కృష్ణవంశీ తన శ్రీ ఆంజనేయం చిత్రం ద్వారా ఛార్మిని తెలుగు తెరకు తిరిగి పరిచయం చేశాడు.
ఈ చిత్రంతో నితిన్, చార్మికి మంచి పేరు వచ్చాయి..అంతే కాదు చార్మికి వరుసగా తెలుగులో సినిమా అవకాశాలు రావడంతో ఈ అమ్మడు గ్లామర్ తరహా పాత్రల్లో నటిస్తూ ఒక్కఊపు ఊపింది. 2007 డిసెంబరు లో విడుదలయిన మంత్ర ఊహించని విజయం సాధించి తెలుగు కథానాయికలలో ఛార్మికి ప్రత్యేక స్థానం కట్టబెట్టింది. సస్పెన్స్, హారర్ ప్రధానాంశాలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఛార్మి నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తర్వాత క్రమంలో సినిమా చాన్సులు తగ్గడంతో ఐటమ్ సాంగ్స్ కూడా ఓకే చెప్పేసింది.
గత సంవత్సరం పూరీ జగన్నాద్ దర్శకత్వలో ‘జ్యోతి లక్ష్మి’ సినిమా తీశాడు కానీ అది అనుకున్నంత విజయం సాధించలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలకు కాస్త దూరంగానే ఉంది. నిర్మాతగా ప్రయత్నాలు చేస్తుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. గతంలో ఈవెంట్స్ కి బాగా వెళ్లే చార్మి ఇప్పుడు అవి కూడా బాగా తగ్గించింది.
మొన్నామధ్య తన హెయిర్ని కట్ చేసి క్యాన్సర్ భాదితులకు అందజేసానని తెలిపింది ఛార్మి. ఇక అప్పటి నుండి షార్ట్ హెయిర్ తోనే దర్శనమిస్తోంది ఈ అమ్మడు. ఇక తాజాగా తన హెయిర్తో సరికొత్త స్టైల్స్ ని ట్రై చేస్తోంది. ఈ అండర్ కట్ ట్రెండ్ని ట్రై చేసానంటూ ఓ పిక్ ని కూడా పోస్ట్ చేసింది ఛార్మి. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తుంది.