ఈ మధ్య కాలంలో రీజనల్ ఫిల్మ్ ఇండస్ట్రీలు సైతం బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ధీటుగా రికార్డ్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. దీంతో రీజనల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మూవీలకి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ, ఇంటర్నేషనల్ మార్కెట్ లోనూ మంచి డిమాండ్ పలుకుంది. అందుకు కారణం బాహుబలి తరహా రీజనల్ ఫిల్మే. బాహుబలి మూవీతో రాజమౌళి ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.


అదే విధంగా ఈ మూవీకి కథని అందించిన విజయేంద్ర ప్రసాద్‌ సైతం మంచి పేరుని సంపాదించుకున్నాడు. బాహుబలి విజయం అనంతరం విజయేంద్ర ప్రసాద్‌ కి బాలీవుడ్,కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అయితే టాప్ హీరోలకి సంబంధించిన మూవీలకే తను కథలను అందించాలని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి చాలా మంది హీరోలు విజయేంద్ర ప్రసాద్‌ ని కథని కోరగా ఇప్పటి వరకూ ఏ హీరోకి కమిట్మెంట్ ఇవ్వలేదు.


అయితే తాజాగా స్టార్ హీరో విజయ్ మూవీకి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తమిళనాట విజయ్‌కి ప్రత్యేకంగా క్రేజ్ ఉంటుంది. రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి బాక్సాఫీస్ ఒక్క విజయ్ కి మాత్రమే ఉంటుందనేది స్పష్టం. విజయ్ హీరోగా, దర్శకుడు అట్లీ తెరకెక్కించనున్న ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చనున్నారు. అయితే తాజాగా విజయేంద్ర ప్రసాద్‌ తన కథని రాజమౌళికి వినిపించాడు. ఇందులో రాజమౌళి కొన్ని మార్పులు చేయటం జరిగిందట.


ఆ విషయం విజయ్ ఎలా తెలుసుకున్నాడో తెలియదు కానీ…తన కథలో రాజమౌళికి సంబంధించిన సలహాలు..మార్పులు ఏ మాత్రం అవసరం లేదని, డైరెక్టర్ అట్లీతో విజయేంద్ర ప్రసాద్‌ కి చెప్పించాడనే టాక్స్ కోలీవుడ్ లో బలంగా వినిపిస్తున్నాయి. దీంతో విజయేంద్ర ప్రసాద్‌ సైతం త్వరలోనే డైరెక్టర్ అట్లీ…హీరో విజయ్ లతో పూర్తి స్థాయి కథా చర్ఛల్లో పాల్గొననున్నారనే న్యూస్ తెలుస్తుంది. విజయేంద్ర ప్రసాద్‌ గతంలో బాహుబలి, భజరంగీ భాయ్‌జాన్ సినిమాకి కథని అందించిన విషయం తెలిసిందే. అలాగే రాజారాణి, తేరీ వంటి సినిమాలతో అట్లీ మంచి విజయాలను అందుకున్నాడు. దీంతో ఈ కాంబినేషన్ పై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: