మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అప్ కమింగ్ 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక చిరంజీవి సైతం ఈ మూవీ షూటింగ్ ని వేగంగా పూర్తి చేసేందుకు తన షెడ్యూల్స్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ‘ఖైదీ నెం 150’ కోసం రాత్రి..పగలు తేడా లేకుండా చిత్రయూనిట్ పనిచేస్తున్నారు. అయితే ‘ఖైదీ నెం 150’ మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తయిన తరువాత...డబ్బింగ్ కార్యక్రమాలను పెట్టుకోవాల్సిందిగా చిత్రయూనిట్ కి డైరెక్టర్ వినాయక్ డైరెక్షన్స్ ఇచ్చాడు.


ప్రస్తుతం టాకీ పార్ట్ జరుగుతుండగానే...మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ‘ఖైదీ నెం 150’ మూవీని సంక్రాంతికి అనుకున్న సమయానికే విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు. దాదాపు 8 సంవత్సరాల తరువాత హీరోగా చిరంజీవి రావటంతో...ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడే అవకాశం ఎక్కువుగా ఉంది.


అయితే డబ్బింగ్ విషయంలో మాత్రం చిరు కొద్దిగా తొందరపడుతున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ లో  కొంత భాగం పూర్తయిన వెంటనే తనకి సంబంధించిన డబ్బింగ్ ని పెట్టుకోవాలని వినాయక్ కి సూచించాడు. అయితే వినాయక్ మాత్రం చిరుతో ఏకీభవించలేదు. దీనిపై కొద్దిగా కోపం తెచ్చుకున్న చిరంజీవి...వినాయక్ పై ఒత్తిడి తీసుకొచ్చి... పూర్తయిన పోస్ట్ ప్రొడక్షన్ కి డబ్బింగ్ ని పూర్తి చేస్తున్నాడు.


ఇందులో భాగంగానే తాజాగా చిరు తన పాత్రకి డబ్బింగ్ చెప్పడం ప్రారంబించారు. ఇక నిర్మాత రామ్ చరణ్ ‘ఖైదీ నెం 150’ చిత్రానికి ప్రమోషన్ ప్లానింగ్ ని చేపడుతున్నాడు. ఈ మూవీలో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవి శ్రీ సంగీతం ‘ఖైదీ నెం 150’ చిత్రానికి హైలెట్ గా నిలవనుందని అంటున్నారు. ‘కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్’ పై వస్తున్న ఈ చిత్రం చరణ్ కి ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: