నాగచైతన్య, సమంత.. ప్రస్తుతం టాలీవుడ్ లో వీరి మేనియా నడుస్తోంది. ప్రతీ రోజూ  వీరిద్దరూ వార్తల్లో నిలుస్తున్నారు. నాగ చైతన్య, సమంత ప్రేమాయణం నుండి వివాహం వరకు ప్రతీదీ చర్చనీయాంశమౌతోంది. కొన్నేళ్లు సీక్రెట్ గా సాగిన ప్రేమాయణాన్ని అటు సమంత, ఇటు నాగ్ చైతన్య కొద్ది రోజుల క్రితం బహిర్గతం చేశారు. వీరి పెళ్లికి పెద్దలు కూడా అంగీకారం తెలిపారు. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా ప్రకటించారు. వచ్చే ఏడాది నాగ చైతన్య, సమంతల పెళ్లి ఉంటుందని చెప్పారు. అయితే.. పెళ్లి విషయంలోనే అక్కినేని, సమంతల ఫ్యామిలీలో కొంత సందిగ్ధం ఏర్పడింది. ఇందుకు నాగ చైతన్య హిందువు కావడం, సమంత క్రిస్టియన్ కావడమే కారణం. దీంతో రెండు సాంప్రదాయాల ప్రకారం రెండు సార్లు వివాహం జరిపించాలనే నిర్ణయానికి ఇరు కుటుంబాలు వచ్చినట్లు జోరుగా వార్తలొచ్చాయి. 


ప్రస్తుతం సోషల్ మీడియాలో నాగచైతన్య, సమంతలున్న రెండు ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. ఆ ఫోటోలు అటు టాలీవుడ్, ఇటు ఫిలింనగర్ వర్గాల్లో అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. హీరోయిన్ సమంత మతం మారిందా? హిందూ మతం స్వీకరించిందా? నాగ చైతన్యతో పెళ్లి నేపథ్యంలోనే సమంతా హిందూ మతం తీసుకుందా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం అక్కినేని వారి కుటుంబంలో జరిగిన ఓ కార్యక్రమానికి సమంత కూడా హాజరైంది. ఈ సందర్భంగా నాగ చైతన్య, సమంత ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు, ఇరువురు కుంకుమ బొట్లు పెట్టుకుని ఉన్నారు. మరో ఫోటోలో నాగార్జున, చైతన్య, సమంత ముగ్గురూ ఉన్నారు. 


సమంత నాగ్ ఇంట్లో జరిగిన కార్యక్రమానికి హజరవ్వడం పెద్ద విశేషం కాకున్నా.. ఫోటోల్లో ఆమె కుంకుమ బొట్టు పెట్టుకోవడం పైనే ఫిలింనగర్ వర్గాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. చైతూతో పెళ్లి నేపథ్యంలోనే సమంత హిందూ మతం తీసుకుందన్న అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఘర్ వాప్సీ ద్వారా సమంత హిందూ మతంలోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నాయి. ఫోటోల్లో కొందరు పురోహితులు కనబడం వీరి అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అయితే ఈ ఫోటోలకు సంబంధించి అటు అక్కినేని ఫ్యామిలీ కానీ, ఇటు సమంత కానీ ఇంత వరకు స్పందించలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: