పటాస్ మూవీతో ఫుల్ ఫాంలోకి వచ్చిన హీరో కళ్యాణ్ రామ్. పటాస్ సక్సెస్ తో కళ్యాణ్ రామ్ నటించిన మూవీలకి ఇండస్ట్రీలో మంచి స్పందన వస్తుంది. అలాగే బిజినెస్ పరంగా కళ్యాణ్ రామ్ మూవీలకి సైతం మంచి మార్కెట్ ఏర్పడుతుంది. ఇదిలా ఉంటే పూరీ జగన్నాథ్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ కి ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో...వీరిద్దరి కాంబినేషన్ మార్కెట్ వర్గాలకు మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తుంది.


వీరిద్దరి క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఇజం’. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటికే ఇజం మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్..టీజర్ లు మూవీపై హైప్ ని క్రియేట్ చేశాయి. అయితే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ దసర పండుగ సందర్భంగా రిలీజ్ కావాలి. కానీ అనుకోని విధంగా ఈ మూవీకి పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావటంతో...రిలీజ్ కూడ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.


అయితే ఈ మూవికి సంబంధించిన షూటింగ్ సమయంలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ టేకింగ్ కళ్యాణ్ కి చాలా ఆశ్ఛర్యాన్ని ఇచ్చిందట. ఇప్పటి వరకూ తను పనిచేసిన డైరెక్టర్స్ లో పూరీ జగన్నాథ్ స్టైల్ చాలా డిఫ్రెంట్ అని అంటున్నారు. షాట్ ఎప్పుడు ఒకె అయిందో తనకే తెలియకుండా పూరీ ఓకె చేసేవాడని అంటున్నారు. అలాగే సీన్స్ లోని యాక్టింగ్ చాలా నేచ్యురల్ ఉంటుందని చెప్పుకొచ్చాడు.


తను నటిస్తున్నానా? అనే అనుమానం చాలా సందర్భాల్లో హీరోకే కలుగుతుందని చెప్పుకొచ్చాడు. ఈ విషయాలు పూరీ జగన్నాథ్ తో నటిస్తున్నప్పుడు సినిమా పూర్తయ్యేంత వరకూ తనలో మెదలాడుతూనే ఉన్నాయని అంటున్నాడు. అయితే పూరీ జగన్నాథ్ పై ఈ తరహా కంప్లైంట్ దాదాపు అందరి హీరోల నుండి వచ్చిందే అని ఇండస్ట్రీ అంటుంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తన డబ్బింగ్ పార్ట్‌ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాను కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించిటం విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: