టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న హీరో మహేష్ బాబు. అలాగే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ మురుగదాస్. ఒక్క సౌత్ లోనే కాకుండా డైరెక్టర్ మురుగదాస్ కి బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ మంచి క్రేజ్ ఉంది. ఇక ఇలాంటి నెంబర్ వన్ కాంబినేషన్ నుండి ప్రస్తుతం ఓ మూవీ తెరకెక్కుతుంది. మురుగదాస్-మహేష్ కాంబినేషన్ పై ప్రస్తుతం ఇండస్ట్రీలో భారీ హైప్ క్రియేట్ అయింది.


తాజాగా చెన్నైలో ఈ మూవీకి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ ప్రారంభం అయింది. షూటింగ్ సైతం చిత్రయూనిట్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తోంది. అయితే ఈ మూవీలో 5 ప్రధాన హైలెట్స్ ఉన్నాయని అంటున్నారు. ఈ చిత్రానికి కథ పెద్ద ప్లస్ అని అంటున్నారు. సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ స్టోరి కావటం విశేషం. అలాగే మహేష్ బాబు ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడు.


కొన్ని సీన్స్ లో పొలిటికల్ లీడర్ గానూ కనిపించనున్నారు. ఇక ఈ మూవీ కోసం మహేష్ బాబు మరోసారి తన సిక్స్ ప్యాక్ బాడీని ప్రదర్శించనున్నారు. ఫైనల్ గా హీరోయిన్ తో మహేష్ బాబుకి లిప్ లాక్ సీన్స్ ఓ మూడు వరకూ ఉంటాయని చిత్ర యూనిట్ నుండి వినిపిస్తున్న సమాచారం. మొత్తంగా ఈ హైలెట్స్ సినిమాని చూస్తున్నవారికి సంతోషపెట్టే విధంగా ఉంటాయని అంటున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు.


మహేష్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తోండగా, దర్శకుడు ఎస్.జె.సూర్య విలన్‌గా నటించటం విశేషం. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం, ఈ సంవత్సరం చివర నాటికి టాకీపార్ట్ ని పూర్తి చేయనున్నారు. 2017 సంవత్సరం వేసవిలో ఈ మూవీని విడుదల చేయనున్నారని తెలుస్తుంది. మొత్తంగా మురుగదాస్-మహేష్ బాబు కాంబినేషన్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో బ్లాక్ మూవీగా నిలవనుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: