తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరూ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రం ఎట్టకేలకు ప్రారంభమై షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ‘ఖైదీనెం. 150’ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రంపై అప్పుడు విపరీతమైన క్రేజ వచ్చేలా అన్ని రకాలుగా వ్యూహాలు పన్నతున్నారు చిత్ర యూనిట్. చిరంజీవి దాదాపు పంది సంవత్సరాల తర్వాత తెరపై కనిపించ బోతున్నారు..దీంతో అభిమానుల్లో కూడా ఎంతో ఉత్సాహం మొదలైంది. తమ అభిమాన నటుడు చిరంజీవి తెరపై ఎప్పుడెప్పుడు చూడాలా అని..అయితే ఈ చిత్రం షూటింగ్ త్వరగా జరుపుకొని సంక్రాంతి బరిలో దించాలని అనుకుంటున్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు మెగాస్టార్ కి సంక్రాంతికన్నా సమ్మర్ లోనే ఎక్కువ బ్లాక్ బస్టర్ హిట్లొచ్చాయి. అందుకే మెగాటీమ్ ఇప్పుడు ఆ రూట్లో ఆలోచిస్తోందని అనుకుంటున్నారు. ‘ఖైదీనెం.150’ సమ్మర్ రిలీజ్ కు పోస్ట్ పోన్ అయి సమ్మర్ కే రిలీ చేస్తారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రామ్ చరణ్ సినిమా ఎలాగూ ఆలస్యమైంది కాబట్టి, దాన్ని మరికాస్త వెనక్కు జరిపి సంక్రాంతి బరిలో దింపితే బెటర్ అని ఆలోచిస్తున్నారట.
మరోవైపు నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘గౌతమీ పుత్ర శాతకర్ణీ’ సంక్రాంతి బరిలో దిగబోతున్న నేపథ్యంలో రెండు పెద్ద సినిమాలు ఒకేసారి అంటే కలెక్షన్ల పరంగా కూడా తేడాలు రాక తప్పవని అనుకుంటున్నారు. అందుకే రామ్ చరణ్ చిత్రం సంక్రాంతిలో విడుదలైతే..మెగాస్టార్ చిరంజీవి సమ్మర్ లో ప్లాన్ చేస్తున్నారని టాక్.
అంతే కాదు 150వ సినిమాకు వంద కోట్లు వసూళ్లు సాధిచాలని, కనీసం 70 కోట్లకు అమ్మాలని చూస్తున్నారు. అందువల్ల ఆ రేంజ్ కలెక్షన్లు రావాలంటే సోలోగా సమ్మర్ లో రావడం బెటర్ అని అంటున్నారట.