ఫిల్మ్ ఇండస్ట్రీలోని సెలబ్రిటీల మధ్య ఎటువంటి వాతావరణం ఉంటుంది? అనేది తెలుసుకోవాలని అందరూ అనుకుంటారు. అయితే అదే ఫిల్మ్ సెలబ్రిటీలు ఒకరికొకరు తెలుసుకొని పెళ్ళి చేసుకొంటే…వారి మధ్య ఉండే బంధం కొన్ని సమయాల్లో బ్రేక్ అవుతూ ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో చిరస్థాయిగా ఉంటుంది. ఆ విధంగానే ప్రస్తుతం బాలీవుడ్ పిల్మ్ ఇండస్ట్రీలో భార్యభర్తలుగా ఉంటున్న అభిషేక్ బచ్ఛన్, ఐశ్వర్యరాయ్ ల మధ్య గొడవలు మొదలైనాయి అంటూ ఇండస్ట్రీలో ఓపెన్ టాక్స్ వినిపిస్తున్నాయి.


దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…. ఐశ్వర్యరాయ్ పెళ్లి తరవాత చాలా గ్యాప్ తీసుకొని తిరిగి ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రి ఇచ్చింది. ప్రస్తుతం ఐశ్వర్యరాయ్ పలు సినిమాలతో ఫుల్ బిజిగా ఉన్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో ఐశ్వర్యరాయ్ బాగా లావుగా కనిపించారు. తరువాత ఎన్నో ఆరోగ్య జాగ్రత్తలను తీసుకొని తిరిగి గత సౌందర్యాన్ని, ఫిట్ నెస్ ని పొందారు. అయితే ఐశ్వర్యరాయ్ ‘ఏ దిల్ హై ముషికిల్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.


ఈ సినిమాలో ఐశ్వర్య సరసన రన్‌భీర్ కపూర్ నటిస్తుండగా అనుష్క శర్మలు ప్రధాన పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్‌లో నిమగ్నమయ్యారు. ఇక ఈ మూవీలో ఐశ్వర్యరాయ్ ఘాటుగా రొమాన్స్ చేశారు. సెకండ్ ఇన్నింగ్స్ లో మొదటిసారిగా రొమాన్స్ చేసిన చిత్రంగా ఏ దిల్ హై ముషికిల్ నిలవనుంది. రణ్ భీర్ కపూర్ తో చేసిన ఘూటు ముద్దులు ఇండస్ట్రీని వేడెక్కిస్తున్నాయి. పెళ్లి తరువాత కూడ ఐశ్వర్యారాయ్ చేస్తున్న రొమాన్స్ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ తరహా రొమాన్స్ పై భర్త అభిషేక్ బచ్ఛన్ కొంత కోపంగా ఉన్నాడంట.


పెళ్ళి తరువాత కూడ ఈ తరహా రొమాన్స్ చేయటం ఏమంత కరెక్ట్ కాదని చెప్పుకొచ్చాడంట. ఐశ్వర్యారాయ్ కి సినిమా అంటే పాషన్ కాబట్టి…కచ్ఛితంగా తను భవిష్యత్ లోనే ఇలాంటి మూవీలనే కొన్ని చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో ఏ దిల్ హై ముషికిల్ మూవీ విషయంలో గత కొద్ది రోజులుగా కోల్డ్ వార్ నడుస్తుందని బిటౌన్ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న టాక్స్. ఇక ఐశ్వర్యరాయ్…తన కూతురు ఆరాధ్య తో తాజాగా చిత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొనటం విశేషం. ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల కానుంది. మొత్తంగా ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్ఛన్ ల వ్యవహారం కొంత వేడిగానే ఉందని బిటౌన్ మీడియా అంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: