మాస్ రాజ రవితేజ తో సినిమా అంటే సామాన్య విషయం కాదు. రవితేజతో మూవీని కన్ఫర్మ్ చేయించుకోవటం చాలా ఈజీ అని అందరూ అనుకుంటారు. తను అనుకున్న ఫిక్డ్స్ రెమ్యునరేషన్ ని రవితేజకి ఇస్తే చాలు…సినిమాని ఇట్టే ఒప్పేసుకుంటాడు అనేది ఇండస్ట్రీలో ఉన్న టాక్స్. అయితే నిజానికి తను అనుకున్న రెమ్యునరేషన్ ని తీసుకోవటమే కాకుండా, మొదటగా తనకి వినిపించిన కథని తెరకెక్కించటంలో తేడా వస్తే మాత్రం అస్సలు సహించడు.


గత సంవత్సరకాలంగా రవితేజ తో ముగ్గురు ప్రముఖ నిర్మాతలు సినిమాకి రెడీ అయ్యారు. వీరంతా రవితేజ కి అడ్వాన్స్ లను ఇచ్చిన నిర్మాతలే. అయితే వీరు మొదటగా రవితేజ వినిపించిన కథ ఒకటి…తరువాత కథ పూర్తయ్యాక దాన్ని తెరకెక్కించే విధానం మరొకటి. దీంతో ఫైర్ అయిన రవితేజ ఆ సినిమాల నుండి తప్పుకోవటం జరుగుతుంది. ఈ విధంగా ఈ సంవత్సరం ఆ ముగ్గురు నిర్మాతలు, రవితేజ తో గేమ్ ఆడారని తెలుస్తుంది.


దీని కారణంగా రవితేజ ఏ మూవీని స్టార్ట్ చేయలేకపోయాడంట. అనుకున్న ప్రాజెక్ట్స్ అన్ని ముహుర్తానికి మాత్రమే నోచుకొని ఆగిపోయాయి. దీంతో రవితేజ కథని ఫైనల్ చేసుకొని ప్రస్తుతం ముందువెళున్నాడు. ఇదిలా ఉంటే… బాబీ దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమాను అక్టోబర్ 12వ స్టార్ట్ చేయనున్నారు.


రామ్ తాళ్లూరి నిర్మిస్తోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా గ్లామర్ బ్యూటీ రాశి ఖన్నా కనిపించనుంది. అలాగే డైరెక్టర్ విక్రమ్ కాంబినేషన్ లోనూ రవితేజ ఓ సినిమా చేయనున్నాడని అంటున్నారు. మొత్తంగా వరుస సినిమాలతో రవితేజ త్వరలోనే బిజిగా మారనున్నాడు. వరుసగా తన 3 చిత్రాలు ఆగిపోవటంతో భవిష్యత్ లో కథపై పెత్తనం చెలాయించే నిర్మాతల బ్యానర్ లో అస్సలు నటించకుడదనే నిర్ణయానికి వచ్చాడంట. రవితేజ కి ఎంతలా కోపం వస్తే…ఈ విధమైన నిర్ణయానికి వచ్చి ఉంటాడని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: