ఈ దసరా రేస్ ను టార్గెట్ చేస్తూ విడుదల అవుతున్న ‘అభినేత్రి’ సినిమాను ప్రభుదేవ ఈ సినిమా హీరోయిన్ తమన్నాతో కలిసి ప్రమోట్ చేస్తూ ఈ సినిమా విడుదల కాబోతున్న ప్రముఖ నగరాలలో ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఈసినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలను వివరిస్తూ మధ్యలో ప్రభుదేవ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ నయన తార పై సంచలన వ్యాఖ్యలు చేసాడు.
ప్రభుదేవాను ప్రేమించిన నయనతార ఆపై అతడిని పెళ్ళి చేసుకోవడానికి తన మతం కూడ మార్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత ఏమైందో ఏమో తెలియదు కాని వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకోవడం ఇప్పటికీ సస్పెన్స్. అయితే ఈ విషయమై ఇప్పటి వరకు అటు నయన్ కాని ఇటు ప్రభుదేవా కాని ఎప్పుడూ స్పందించలేదు.
అయితే ‘అభినేత్రి’ సినిమాను ప్రమోట్ చేస్తూ ప్రభుదేవా చేసిన కామెంట్స్ నయనతారను టార్గెట్ చేసేవిగా ఉన్నాయి అని అంటున్నారు. నయనతారతో తన లవ్ స్టోరీ గురించి మాట్లాడుతూ ‘అన్ని ప్రేమకథలూ సుఖాంతం కావు. నాదీ అంతే. ప్రేమలో పడడం, అందులో విఫలం అవ్వడం కూడా ప్రేమలో ఒక భాగంగానే చూస్తాను. అయ్యిందేదో అయ్యింది. దాని గురించి నేనేం చింతించడం లేదు. నిజానికి అంత టైమ్ కూడా లేదు. నా పర్సనల్ లైఫ్ నాకుంది. దాంతో నేను హ్యాపీగా ఉన్నా’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు ప్రభుదేవ.
ఇదే సందర్భంలో ప్రభుదేవా మాట్లాడుతూ సృష్టిలో అందరికీ ఏదో ఒక రూపంలో బాధలు వెంటాడుతూనే ఉంటాయని సంపూర్ణ ఆనందంతో ఉన్న వ్యక్తి ఎవ్వరూ ఉండరని, అలాంటి వ్యక్తి ఎదురైతే, తప్పకుండా అతనికి సలాం కొట్టి అతని దగ్గర సహాయకుడిగా మారిపోతాను అంటూ వేదాంత పరమైన కామెంట్స్ చేసాడు ప్రభుదేవ. దీనితో ఆ కామెంట్స్ ప్రభుదేవా నోటి నుండి విన్న మీడియా వర్గాలు ప్రభుదేవ ఇప్పటికీ నయనతారను మరిచిపోలేక పోతున్నాడు అంటూ గుసగుసలు ఆడుకున్నట్లు టాక్.
ఇదే సందర్భంలో ప్రభుదేవ మాట్లాడుతూ తాను చిరంజీవి 150వ సినిమాకు సంబంధించిన పాటలకు డాన్స్ కంపోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అయితే తనకు మెగా కాంపౌండ్ నుంచి ఎటువంటి పిలుపు ఇప్పటి వరకు లేదు అని అనడం బట్టి చిరంజీవి ప్రభుదేవాను మర్చిపోయాడా అని అనిపించడం సహజం. 12 సంవత్సరాల తరువాత తిరిగి ప్రభుదేవ హీరోగా నటిస్తున్న ఈ ‘అభినేత్రి’ సినిమాకు నిర్మాతగా కూడ వ్యవహరిస్తున్న నేపధ్యంలో ఈ సినిమా విజయం పై చాల ఆశలే పెట్టుకున్నాడు ప్రభుదేవ..