ఇప్పటి వరకు బయోస్కోపిక్ చిత్రాలు ఏవి వచ్చినా జనాలు వాటిని బాగా ఆధరించారు.  జార్ఘండ్ వీరుడు మహేంద్ర సింగ్ దోనీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎం.ఎస్.దోనీ (ద అన్ టోల్డ్ స్టోరీ) నిన్న ప్రపంచ వ్యాప్తగా భారీ ఎత్తున విడుదలైంది.  మొదటి నుంచి ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. అందరూ ఊహించినట్లుగానే మొదటి రోజున21 కోట్లకు పైగా వసూళ్ళ ని రాబట్టడంతో సంచలనం సృష్టించింది. ఎలాంటి పేరు ప్రఖ్యాతలు లేని  హీరో సుశాంత్ సింగ్ రాజ్ నటించిన ఈ చిత్రం మొదటి రోజు ఆ రేంజ్ లో వసూళ్లు చేయడం అంటే సామాన్య విషయం కాదు..అయితే దీనికి కారణం ఈ సినిమా ధోనీ సినిమా కావడమే అంటున్నారు.  
Image result for ms dhoni movie
ఎం ఎస్ ధోని చిత్రానికి  నీరజ్ పాండే దర్శకత్వం వహించారు . ఇండియా కెప్టెన్ ఎం ఎస్ ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం కావడంతో ఈ స్థాయి ఓపెనింగ్స్ రావడానికి కారణం అయ్యింది.  ఈ సంవత్సరం అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన చిత్రంలో ఇది రెండవది కావడం విశేషం.
Image result for ms dhoni movie
మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 21 .30 కోట్ల గ్రాస్ వసూళ్ళ ని సాధించి సంచలనం సృష్టించిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక ఈరోజు, రేపు కూడా అదే జోరు కొనసాగితే మరిన్ని సంచలనాలు నమోదు చేయడం ఖాయం. అంతే ఈ నెలలో వరుసగా సెలవులు రావడం కూడా ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అవుతుందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: