మహేష్ బాబు నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ మురుగదాస్ డైరెక్షన్లో వస్తుందనే విషయం తెలిసిందే. ఇప్పటికే పలు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం రీసెంట్ గా చెన్నైలో ముఖ్యమైన షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఇండియాలోని ప్రధాన నగరాల అన్నింటిలో ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ జరగనుంది. ఇప్పటికే కొన్ని ప్రధాన నగరాలకి సంబంధించిన లొకేషన్స్ ని చిత్ర యూనిట్ ఎంపిక చేసింది.

ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ లో మురుగదాస్ ఈ మూవీ షెడ్యూల్ ని స్టార్ట్ చేశాడు. హైదరాబాద్ లో మహేష్ మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాలను రద్ధీగా ఉన్న రోడ్లపై చేయాల్సి ఉంది. ఇందుకు కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలను సెలక్ట్ చేసుకున్నారు. కొన్ని వీధుల్ని స్డూడియోలలో చిత్రీకరించనున్నారు. అయితే రియాలిటీ కోసం మహేష్ బాబుని హైదరాబాద్ రోడ్లపై నిజంగానే షూటింగ్ చేయాలని భావిస్తున్నాడు.

తన టీం చేత సర్వే చేయించిన మురుగదాస్ కి కొన్ని షాకింగ్ ని ఇచ్చే విషయాలు తెలిపాయి. బంజరాహిల్స్ లో రద్ధీలేని కొన్ని రోడ్లని షూటింగ్ కోసం ఎంపికచేశారు. అన్ని పర్మిషన్స్ తో రెడీ అయిన చిత్ర యూనిట్ కి అక్కడ లోకల్స్ షాకింగ్ ఇచ్చారు. మహేష్ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుసుకున్న ఆ ఏరియాలో చాలా మంది...ఉదయాన్నే ఈ రోడ్లపైకి భారీగా వచ్చారు.

దీంతో ఇది షూటింగ్ కి ఎంత మాత్రం అనుకూలంగా లేదని మురుగదాస్ కి వారి అసిస్టెంట్స్ రిపోర్ట్ ఇచ్చారు. ఇది తెలుసుకున్న మురుగదాస్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అదే చెన్నైలో అయితే ఎంత బిజి రోడ్లయినా...షూటింగ్ చేసుకోవటానికి వీలుగా ఉంటాయి. ఇక్కడ ఆ పరిస్థితి కనిపించకపోవటంతో మురుగదాస్ షాకింగ్ అయ్యాడు. ఇదిలా ఉంటే..ఈ హైదరాబాద్ షెడ్యూల్ తరువాత అక్టోబర్ 3వ వారంలో అహ్మదాబాద్, గుజరాత్ లలో మరో షెడ్యూల్ జరుగుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: