బాహుబలి పుణ్యమాని రాజమౌళి సౌత్ సూపర్ డైరక్టర్ గా క్రేజ్ దక్కించుకున్నాడు. అయితే అర్జెంట్ గా తమిళ పరిశ్రమ కూడా అలాంటి సినిమా ఒకటి తీసి తమ సత్తా చాటాలని అందరు ప్రయత్నిస్తున్నారు. శంకర్ ఏమో రోబో 2.0 మీద తన శక్తి మొత్తం పెట్టేస్తుంటే ఇప్పుడు సుందర్ కూడా తన డ్రీం ప్రాజెక్ట్ తో సత్తా చాటాలని చూస్తున్నాడు. 


అసలైతే ఈ సినిమా మహేష్ బాబు, విజయ్ లాంటి స్టార్ హీరోలతో మొదలవ్వాల్సింది. కాని మహేష్, విజయ్ ఇద్దరు హ్యాండ్ ఇవ్వడంతో జయం రవి, ఆర్యలతో అడ్జెస్ట్ అవుతున్నారు. సంఘమిత్ర అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ ఈ మధ్యనే హాలీవుడ్ త్రిపుల్ ఎక్స్ లో ఛాన్స్ కొట్టేసిన దీపికా పదుకునేని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. అందుకు గాను అమ్మడికి 15 కోట్ల భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట. 


ఓ పిరియాడికల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతుంది. తెలుగు తమిళ భాషల్లో క్రేజీ స్టార్స్ తో తీసి అదే రేంజ్ బిజినెస్ చేసేద్దాం అనుకుంటే సినిమా కోసం రెండేళ్లు డేట్స్ ఇవ్వడం కుదరక ఎవ్వరు ముందుకు రాలేదు. అయినా సరే సుందర్ పట్టుబట్టి మరి జయం రవి, ఆర్యలను ఒప్పించి ఈ సినిమా తీస్తున్నాడు.  


ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో స్టార్ట్ అవనుంది. సినిమా బడ్జెట్ అది నెలకొల్పే రికార్డులతో సినిమా మిస్ చేసుకున్న వారికి ఈర్ష కలిగేలా చేయాలని సుందర్ ప్లాన్. అందుకే ఏకంగా దీపికానే బుక్ చేసే ఆలోచనలో ఉన్నారు. మరి దీపికా ఒప్పుకుంటే కనుక ఈ ప్రాజెక్ట్ కు అదో సెపరేట్ క్రేజ్ వచ్చేసినట్టే.



మరింత సమాచారం తెలుసుకోండి: