హీరో రాజశేఖర్ తో మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ సమరానికి కాలుదువ్వుతుంది. ఇద్దరూ ఒకరి మీద ఒకరు పోటీ పడనున్నారు. అసలు రాజశేఖర్ కు, మంచు లక్ష్మీ కీ గొడవ ఏమిటీ అనుకుంటున్నారా..? మంచు లక్ష్మీ నటించిన నిర్మించిన చిత్రం ‘గుండెల్లో గోదారి.’ ఈ సినిమాపై మంచు లక్ష్మీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పటి వరకూ చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించినా ఇంకా సరైన గుర్తింపు మాత్రంను మంచు లక్ష్మీ దక్కించుకోలేకపోయింది. అయితే ఈ ‘గుండ్లె గోదారి’ సినిమా మాత్రం తనకు మంచి గుర్తింపు తీసుకుని వస్తుందని మంచు లక్ష్మీ ధీమగా ఉంది. ఎన్నోసార్లు విడుదల వాయిదా పడిన ఈ సినిమాను మార్చి 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే అదే తేదీన రాజశేఖర్ నటించిన ‘మహాంకాళి’ కూడా విడుదల అవుతుంది. రాజశేఖర్ కూడా ‘మహాంకాళి’ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. గతంలో స్టార్ హీరోలకు పోటీగా నిల్చిన రాజశేఖర్ ఇప్పుడు హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. దీంతో తనకు బాగా కలిసి వచ్చిన పోలీసు పాత్రతో ‘మహాంకాళి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకు జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించడం విశేషం. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకుల అదరణ దక్కించుకుంటుందో  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: