డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. అనుష్క రుద్రమదేవి పాత్రలో, దగ్గుబాటి రానా చాళుక్య వీరభద్రుడిగా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటులు కూడా ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కథకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న గణపతి దేవ చక్రవర్తి పాత్రను రెబల్ స్టార్ కృష్ణంరాజు చేస్తున్నాడు. మరో ముఖ్యమైన మహామంత్రి శివదేవయ్య పాత్రలో ప్రకాష్ రాజ్ నటించనున్నాడు. నాగదేవుడు పాత్రలో రవిబాబు, ప్రసాదాదిత్యగా అజయ్, అన్నాంభికగా సెక్సీస్టార్ నథాలియా కౌర్ నటిస్తున్నారు. సోమాంబగా ప్రభ, ఇతర ముఖ్య పాత్రల్లో బ్రహ్మనందం, ఎంఎస్ నారాయణ ధర్మవరపు, వెన్నెల కిషోర్ తదితర సీనియర్ నటీనటులు ఈ సినిమాల్లో కనిపించబోతున్నారు. 'రుద్రమదేవి' కథ వినడంతో వెంటనే నటించడానికి ఈ సీనియర్ నటీనటులు అంగీకరించాడని చిత్రయూనిట్ చెబుతోంది. గుణశేఖర్ సినిమా అనగానే సహజంగా భారీ సెట్లు గుర్తుకొస్తాయి. అందుకు అనుగుణంగా ఈ భారీ సినిమాలో ఊహించని రీతిలో సెట్స్ కు పనులు వేగవంతమవుతున్నాయి. 'ఒక్కడు' సినిమా కోసం చార్మినర్ సెట్ నిర్మించిన గోపనపల్లి ప్రాంతంలో రుద్రమదేవి కోసం తోట తరణి ఆధ్వర్యంలో కోట్లాది రూపాయల భారీ ఎరీనా సెట్ నిర్మిస్తున్నారు. కాకతీయుల వైభవాన్ని చాటి చెప్పే రీతిలో 11 భారీ సెట్స్ ను ఈ సినిమా కోసం నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 18 నుంచి ఎరీనా భారీ సెట్ లో రెగ్యులర్ షూటింగ్ జరపబోతున్నారు. గుణశేఖర్ స్వీయనిర్మాణంలో తెరకెక్కించనున్న ఈ సినిమాపై భారీ టాలీవుడ్ లో అంచనాలే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: