తొలి తెలుగు టాకీ ‘భక్త ప్ర్లహ్లద’ 1931, సెప్టెంబర్ 15న విడుదల అయ్యింది. నాటక కంపనీ సురభి చెందిన కళాకారులతో హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. పూర్ణా మంగరాజు చిత్ర నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాలో లీలావతిగా నటించిన సురభి కమలాబాయి తెలుగు తెర తొలి కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా కోసం గీతాలు రాసిన చందాల కేశవదాసు తొలి గీత రచయితగానూ, స్వరాలు కూర్చిన హెచ్.ఆర్.పద్మనాభశాస్ర్తి తొలి తెలుగు సంగీత దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇదండీ తొలి తెలుగు సినిమా కథ..!