బాలీవుడ్ లో నిర్మాతగా రాణిస్తున్న ఏక్తాకపూర్ పై ఐటీ శాఖ దాడి జరిపింది. ఏక్తాకపూర్ కార్యాలయంపైనా, ఇంటి పైనా ఆదాయపు పన్ను శాఖ అధికారులు మంగళవారం నాడు ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి.

టీవీ సీరియల్స్ నిర్మాణం తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఏక్తాకపూర్ చిత్ర సీమలో ప్రవేశించింది. రాగిణి ఎంఎంఎస్, డర్టీ పిక్చర్ వంటి విజయవంతమైన సినిమాలు నిర్మించింది. ఇంకా కొన్ని సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి.

లో బడ్జెట్ తో సినిమాలు తీసి లాభాలు గడించడంలో ఏక్తాకపూర్ మంచి పేరు తెచ్చుకుంది. ఈ కారణంతో ఐటి శాఖ ఏక్తాకపూర్ పై దాడులు నిర్వహిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: