ద‌ర్శ‌క‌ర‌త్న దాసరి మ‌ళ్లీ జోరు పెంచారు. వ‌రుస‌గా సినిమాలు చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకొంటున్నారు. అందులో కొన్నింటిని త‌న శిష్యుల‌కూ అప్ప‌గిస్తారు. దాస‌రికి అత్యంత స‌న్నిహితులు రేలంగి న‌ర‌సింహారావుకీ ఆయ‌న ఓ చిత్రాన్ని అప్ప‌గించారు. ఆ సినిమానే... 'లాక‌ర్లో అమ్మాయిలు, లాక‌ప్‌లో అబ్బాయిలు'.

ఈ చిత్రానికి దాస‌రి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. స‌మ‌కాలిన స‌మాజంలో జ‌రుగుతున్న‌... అనేక సంఘ‌ట‌న‌లే తెర‌పై క‌నిపిస్తాయ‌ట‌. వినోదాత్మ‌క చిత్రాల‌ను రూపొందించ‌డంలో రేలంగిది ప్ర‌త్యేక శైలి. చాలాకాలం త‌ర‌వాత ఆయ‌న మెగాఫోన్ ప‌ట్ట‌నున్నారు. మరి ఇప్ప‌టి ట్రెండ్‌ని ఎలా అర్థం చేసుకొంటారో, వాళ్ల‌కు న‌చ్చేలా సినిమా ఎలా తీస్తారో చూడాలి మ‌రి.

ఈ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: