సినిమా అంతా పాజిటివ్ పాత్ర‌లు పెట్టి న‌డిపించేయ‌డంలో ద‌శ‌ర‌థ్ దిట్ట‌. ఆయ‌న సినిమాలో అంద‌రూ మంచివాళ్లే క‌నిపిస్తారు. లేటెస్టుగా రాబోయే గ్రీకువీరుడులోనూ అంతేన‌ట‌. ఈ సినిమాలో విల‌న్లు ఎవ‌రూ లేర‌ట‌. ఈ విష‌యం నాగ్ స్వ‌యంగా వెల్ల‌డించారు. ఈ సినిమాలో అంద‌రూ మంచి వాళ్లే. ఆ మాట‌కొస్తే నా పాత్ర‌లోని కాస్త నెగిటివ్ షేడ్స్ క‌నిపిస్తాయి. ఆ లెక్క‌న ఈ సినిమాలో విలన్ నేనే క‌దా? అని నాగ్ చ‌మత్కరిస్తున్నారు.

ఈ సినిమా మే 3న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా గురించి నాగ్ చెబుతూ.. ''ద‌శ‌ర‌థ్ ప్రేమ‌క‌థ చెప్ప‌గానే కాస్త ఆలోచించా. ఈ వ‌య‌సులో ల‌వ్ స్టోరీలు ఏమిటి?  అని అడిగా. కానీ న‌న్ను ఒప్పించాడు ద‌శ‌ర‌థ్‌. త‌ప్ప‌కుండా ఈ సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది..'' అంటున్నారు నాగ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: