బండ్ల గణేష్ చేసిన సినిమాలతో కాదు... తన మాటలతోనే ఎక్కువ పాపులర్ అయిపోయాడు. ఆడియో వేడుకలో గణేష్ ఎప్పుడు మాట్లాడతాడా? ఎప్పుడు మాట్లాడతాడా? అని ఎదురుచూసేవాళ్లే ఎక్కువ. అందరి దగ్గరా మార్కులు కొట్టేయడానికి.... ఒకొక్కరినీ ఒక్కో రీతిలో వర్ణిస్తుంటాడు. ఆ కంగారులో.. కొన్ని నిజాలు చెప్పేస్తాడు. అవి సెటైర్లుగానూ మారిపోతాయి. ఇద్దరమ్మాయిలు ఆడియో వేడుకలో గణేష్ కొందరిపై సెటైర్లు వేశాడు.
ముఖ్యంగా... అల్లు అరవింద్పైన... చిరంజీవిని కలుసుకోవాలంటే... ముందు అరవింద్ దర్శనం చేసుకోవాల్సిందే... అని పరోక్షంగా చురక అంటించాడు. చిరుని కలవకుండా చేసింది తమరే సార్... అని చెప్పకనే చెప్పాడు. చిరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బామ్మర్దిపై ఆధారపడక తప్పదని.. గణేష్ మాటల్లోని సారాంశం. ఆ లెక్కన మెగాస్టార్ అభిమానుల ముందే... మెగాస్టార్ పరువు తీసేశాడు
గణేష్! ఆయన గట్స్ ని మెచ్చుకోవలసిందే.