దీని వల్ల రామ్చరణ్కు మంచి జరిగిందో, చెడు జరిగిందో పక్కన పెడితే కొన్ని మీడియాలకు మాత్రం దీన్ని ఫోకస్ చేయండంలో సఫలీకృతులయ్యారు. ముఖ్యంగా సాక్షి మీడియ. గొడవ జరిగిన తరువాత రోజు ఈ టాపిక్ను మీడియాలోకి ఫోకస్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక్క సాక్షిను, ఇంగ్లిష్ డైలీను తప్పితే. జగన్కు అన్యాయం జరిగిన పార్టీలోకి మెగస్టార్ చిరంజీవి జాయిన్ అయి, యూనియన్ మినిస్టర్ తన కేపబులిటిని నిలుపుకున్నారు. అసలే కాంగ్రేస్ మీద విరుచుకు పడుతున్న ఆ మీడియాకు, చరణ్ రచ్ఛ సరిగ్గా కలిసి వచ్చింది.జనాలు జరిగిన అనాగరిక చర్యను చూచి మరచిపోతున్నా, సాక్షి మాత్రం ప్రజల తరుపున మేమున్నాం అంటూ తెగ లైవ్లు నడుపుతుంది. గొడవకు సంబంధించిన వాళ్ళ రిలెటివ్స్ను పిలిపించి మరీ న్యాయఅన్యాయాలకు వారధిని నడుపుతుంది.
సమాజంలో జరిగిన చెడును వెలుగెత్తి చూపటం అనేది మీడియాకు మంచి పరిణామాలు అయినా, ఇక్కడ వ్యక్తిగత టార్గెట్ అనే పాయింట్ను అందరికి తెలిసేలా ఆ మీడియాలో కథనాలు జరుగుతున్నాయి. అసలు సాక్షికు రామ్చరణ్పై కోపమా, చిరంజీవిపై కోపమా అనేది ఇక్కడ ప్రశ్నగా మిగిలించి