తెలుగులో శివతో క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వర్మ ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినా పెద్దగా ఫలితం ఇవ్వకపోవడంతో...తెలుగు ప్రేక్షకులకు సినిమాలు చూడడం రాదని బాలీవుడ్ కి చెక్కేశాడు. సేమ్ మే ఇపుడు గురువు రూటులోనే బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని పూరి ప్లాన్ చేస్తున్నాడు.
ప్రస్తుతం బన్నితో ఇద్దరమ్మాయితో సినిమా చేస్తున్న పూరి ..త్వరలో బాలీవుడ్ లో రెండు సినిమాలు ఒకే నిర్మాతకు చేయబోతున్నాడట. అందులో ఒకటి ఇడియెట్ రీమేక్ అని తెలుస్తోంది. అర్జున్ కపూర్ లేక సిద్దార్ధ్ మల్హోత్రాగానీ హీరోగా నటించే ఛాన్స్ వుందట. ఈ సినిమాల తరువాత బాలీవుడ్ కే మకాం మార్చేయబోతున్నాడని పూరి సన్నిహితులు అంటున్నారు. అందులో బాగంగానే బాంద్రాలో ఓ సొంతింటి కోసం పూరి ప్రయత్నాలు మొదలు పెట్టారట. సో అతి త్వరలో పూరి టాలీవుడ్ కి టాటా చెప్పి బాలీవుడ్ కి చెక్కేస్తాడన్నమాట.