సంజయ్ తో సినిమాలు ఉన్నాయంటూ.. సంజయ్దత్ నిర్మాతలు సుప్రీంలో పిటిషన్ వేశారు. పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. తాము నిర్మించే సినిమాలు నిర్మాణ దశలో ఉన్నందున సంజయ్దత్ లొంగిపోయేందుకు గడువు పొడిగించాలని నిర్మాతలు కోర్టును కోరారు. అయితే తాజాగా ఈ పిటీషన్ ను సుప్రీం తోసి పుచ్చింది. వెంటనే కోర్టుకు లొంగిపోవాలని సంజయ్ కి సూచించింది.
సంజయ్ కేసుతో జంజీర్ నిర్మాత షాక్ కి గురయ్యారు. నిర్మాణ హక్కులపై గతంలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ కేసుతో చాలా కాలంగా రామ్చరణ్ చిత్ర నిర్మాణం ఆగిపోయింది. ఈ కేసుకు ఇప్పుడు తాజాగా సంజ్ కేసు యాడ్ అయింది. ఇప్పుడీ చిత్ర నిర్మాణం మరింత జాప్యం జరగనుంది.
ఇప్పటికే బాలీవుడ్ ఐరన్ లెగ్ అంటూ రామ్చరణ్ ని చెప్పుకుంటున్నారు. తాజా తీర్పుతో ఈ ఒపీనియర్ మరింత బలపడినట్లైంది. రామ్చరణ్ తో సినిమా తీయడానికి బాలీవుడ్ నిర్మాతలు వెనుకడుగేస్తున్న నేపధ్యంలో.. ఇది మరింత ఇబ్బందిగా మారింది.